TS News: కేంద్రం మన నిధులే మనకివ్వడం లేదు: మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల కంటే.. రాష్ట్రం నుంచి కేంద్రానికి

Published : 23 Jan 2022 17:30 IST

ఐనవోలు: తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అడ్డుపడుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధుల కంటే.. రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్లే నిధులు ఎక్కువని చెప్పారు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల అభివృద్ధి పనుల పురోగతిపై ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో జరిగిన ఈ సమీక్షకు మంత్రి ఎర్రబెల్లి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ పెద్దపీట వేస్తున్నారని.. క్షేత్రస్థాయిలో అభివృద్ధి పనులకు అధికారులు ముందుండాలని ఆయన సూచించారు. కేంద్ర ప్రభుత్వం అన్నింటా ఇబ్బంది పెడుతోందని..మన నిధులే మనకి ఇవ్వడం లేదన్నారు. పన్నుల రూపంలో తెలంగాణ నుంచి రూ.2.70లక్షల కోట్లు చెల్లిస్తుంటే తిరిగి మనకి రూ.1.30లక్షల కోట్లు మాత్రమే ఇస్తోందని ఎర్రబెల్లి ఆరోపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని