Telangana News: భాజపాకు బీ టీమ్గా వైకాపా.. ఏపీ మంత్రులపై గంగుల ఫైర్
తెరాస ప్రభుత్వంపై.. మంత్రులు బొత్స సత్యనారాయణ, అమర్నాథ్, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
కరీంనగర్: తెలంగాణ, ఏపీ మంత్రుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మంత్రి హరీశ్రావు వ్యాఖ్యలతో మొదలైన ఈ ఎపిసోడ్ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. తెరాస ప్రభుత్వంపై.. మంత్రులు బొత్స సత్యనారాయణ, అమర్నాథ్, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కౌంటర్ ఇచ్చారు. వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. హరీశ్రావును టార్గెట్ చేసి వైకాపా మంత్రులు ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ...
‘‘తెలంగాణ, తెరాసపై ఎందుకు విషం చిమ్ముతున్నారు. మా సీఎం, ప్రభుత్వం జోలికి వస్తే తీవ్రంగా స్పందిస్తాం. కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వంపై మాట్లాడేవాళ్లకు హెచ్చరిస్తున్నా.. మా జోలికి రావొద్దు. రెచ్చగొడితే తీవ్ర పరిణామాలు ఉంటాయి. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టేలా జగన్ ప్రభుత్వం చూస్తోంది. జగన్ పార్టీ భాజపాకు బీ టీమ్గా వ్యవహరిస్తోంది. సజ్జల, అమర్నాథ్.. తెరాస, హరీశ్రావుపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్నారు. ఎందుకు సజ్జల మాతో పెట్టుకుంటున్నారు. మా సంగతి తెలియదా? గతంలో చూశారు మళ్లీ చూస్తారా? సజ్జల రామకృష్ణారెడ్డిది కుటుంబాల మధ్య చిచ్చుపెట్టే బుద్ధి. వైఎస్ కుటుంబంలోకి వచ్చి తల్లి, కుమారుడు, చెల్లిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశాడు. కేసీఆర్ కుటుంబాన్ని సజ్జల విడగొట్టాలనుకున్నా ఏమీ చేయలేరు. జగన్ ప్రభుత్వం ఫెయిల్ అయింది.. అందుకే తెలంగాణకు వలసలు పెరిగాయి. సజ్జల ప్రస్టేషన్లో ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలో ఎక్కువ పథకాలు ఉన్నాయని హరీశ్రావు అన్నారు. ఆయన్ను వ్యక్తిగతంగా ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు’’ అని గంగుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల సిద్దిపేటలో జరిగిన ఉపాధ్యాయ సంఘాల సమావేశంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ... ఉపాధ్యాయుల పట్ల ఏపీ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోందని, కేసులు పెట్టి జైళ్లలో వేస్తున్నారని వ్యాఖ్యానించారు. హరీశ్ రావు వ్యాఖ్యలపై వైకాపా మంత్రులు బొత్స, అమర్నాథ్ విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ
-
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
-
పతి దేవుడికి గుడి కట్టింది!