KTR: పేదలకు ఇళ్లు ఇవ్వరు.. మోదీ రూ.435 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నారు: మంత్రి కేటీఆర్
‘‘గోల్మాల్ గుజరాత్ మోడల్ చూపి 8ఏళ్లలో మోదీ దేశానికి ఏం చేశారు?. గోల్మాల్ గుజరాత్ను ఎండగట్టడమే మా వ్యూహం. ఆయన జన్ కీ బాత్ వినరు.. మన్ కీ బాత్ మాత్రమే చెబుతారు. 2022 వరకు అందరికీ ఇళ్లు ఇస్తామని మోదీ చెప్పారు.. కానీ, రూ.435 కోట్లతో ఆయనే ఇల్లు కట్టుకుంటున్నారు’’ అని మంత్రి కేటీఆర్ విమర్శించారు.
హైదరాబాద్: సాగు దండగ కాదు.. పండుగ అని నిరూపించిన వ్యక్తి కేసీఆర్ అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా విద్యుత్ ఇవ్వొచ్చని నిరూపించారని కొనియాడారు. ఫ్లోరైడ్ సమస్యను మిషన్ భగీరథతో పరిష్కరించామని తెలిపారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు.
‘‘గోల్మాల్ గుజరాత్ మోడల్ చూపి 8ఏళ్లలో మోదీ దేశానికి ఏం చేశారు?. గోల్మాల్ గుజరాత్ను ఎండగట్టడమే మా వ్యూహం. ఆయన జన్ కీ బాత్ వినరు.. మన్ కీ బాత్ మాత్రమే చెబుతారు. 2022 వరకు అందరికీ ఇళ్లు ఇస్తామని మోదీ చెప్పారు.. కానీ, రూ.435 కోట్లతో ఆయనే ఇల్లు కట్టుకుంటున్నారు. నైజీరియా కంటే దారుణంగా భారత్ తయారవుతోందని నివేదికలు చెబుతున్నాయి. భాజపా ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది. భారత్ రాష్ట్ర సమితి ద్వారా అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తాం. ప్రతి ఒక్కరికీ తాగునీరు, విద్యుత్ ఉచితంగా అందిస్తాం.
ఎస్సీలను వ్యాపారవేత్తలను చేస్తాం. సెప్టెంబర్ 17 లిబరేషన్ డే అయితే ఆగస్టు 15 ఎందుకు కాదు? 2024 పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తాం. మహారాష్ట్ర, కర్ణాటకలో మాకు సానుకూలంగా ఉంది. కర్ణాటకలో కుమారస్వామితో కలిసి పోటీ చేస్తాం. కేసీఆర్ను అవహేళన చేసినవాళ్లంతా చీకట్లో కలిసిపోయారు. అధికారం, పదవుల కోసం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లట్లేదు. మోదీ అండ్ కో వ్యూహాలన్నీ మాకు తెలుసు.. వ్యూహాలను ఎదుర్కొని వారి బాగోతాలను బయటపెడతాం. భాజపా విలువలు లేని రాజకీయాలు చేస్తోంది. మోదీ అన్ని వ్యవస్థలను ఉపయోగించుకుంటారు. వేట కుక్కల్లాగా ఈడీ, ఐటీ, సీబీఐని ఉపయోగించుకుంటారు. ఒక్క భాజపా నేతపైనైనా ఐటీ, ఈడీ దాడులు జరిగాయా? తెలంగాణలో జరుగుతున్న పనిని దేశానికి చెబుతాం. ఏడాదిన్నరలో 28 రాష్ట్రాల్లో పోటీ చేస్తామని చెప్పట్లేదు’’ అని కేటీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలు ఆపార్టీని వీడొచ్చు...
‘‘భాజపా సొంతంగా అధికారంలోకి రావటానికి 40 ఏళ్లు పట్టింది. అధికారంలోకి రావడానికి మాకు అంత సమయం పట్టకపోవచ్చు అధికారమే పరమావధి కాదు.. ప్రజలకు ఏం కావాలో అదే మా అజెండా. కేసీఆర్ తెలంగాణకు ప్రత్యామ్నాయ పదం. మా పార్టీలో కంటెంట్, కటౌట్ ఉంది.. మాకు విజయం దక్కుతుంది. రాహుల్ గాంధీ భారత్ జోడో కాకుండా కాంగ్రెస్ జోడో యాత్ర చేయాలి. తెలంగాణలో ఉన్న పరిస్థితి, పథకాలు యాత్రలో రాహుల్కు తెలుస్తాయి. దేశంలో రాజకీయ శూన్యత ఉంది. ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ఘోరంగా విఫలమైంది. కాంగ్రెస్ అస్తిత్వ పోరాటం చేస్తోంది. రాహుల్ ఇక్కడ ఉన్నప్పుడే కాంగ్రెస్ ఎంపీలు ఆ పార్టీని వదిలే సూచనలు కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఒకరిద్దరు ఎంపీలు కాంగ్రెస్ను వీడొచ్చని వింటున్నా. వచ్చే ఎన్నికల వరకు కాంగ్రెస్ ఉంటుందన్న నమ్మకం లేదు. పార్టీ అధ్యక్షుడే ఓడిపోయారు.. ఆ పార్టీ గురించి మాట్లాడడమే వృథా.
కిషన్రెడ్డి ఫోన్ను ప్రధాని ట్యాప్ చేస్తున్నారు..
‘‘పైసల కోసమే రాజగోపాల్రెడ్డి పదవిని పణంగా పెట్టి భాజపాలో చేరారు. రూ.22వేల కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చాకే ఆయన భాజపాలో చేరారు. రాజగోపాల్రెడ్డి రూ.500 కోట్లు ఖర్చుపెడతానని అమిత్ షాకు చెప్పినట్టు తెలిసింది. ఓటుకు రూ.30వేలు ఇచ్చి గెలుస్తానని రాజగోపాల్రెడ్డి అంటున్నారు. మునుగోడులో 30శాతం ఓట్లు మాకు ఎక్కువగా ఉన్నాయి. మునుగోడులో మేం గెలించాం.. రెండో స్థానం కోసం కాంగ్రెస్, భాజపా మధ్య పోటీ. హిందూ, ముస్లిం అంటూ మోహన్ భగవత్ మాటలు పట్టించుకోం. ఆయన్ను కౌన్సిలర్గా గెలవమనండి చూద్దాం. 2014లో మోదీ దేశవ్యాప్తంగా 100 చోట్ల ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 2024లో కేసీఆర్ కూడా అలాగే ప్రచారం చేస్తారు. తెలంగాణ మోడల్ను కేసీఆర్ దేశ వ్యాప్తంగా ప్రచారం చేస్తారు. ఇదే పాలన దేశ ప్రజలకు ఇస్తామని వాగ్దానం చేస్తాం. నా ఫోన్ సహా 10వేల మందికి పైగా ఫోన్లలో పెగాసస్ ఉంది. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఫోన్ను ప్రధాని ట్యాప్ చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ విషయం కిషన్రెడ్డికి తెలియదు’’ అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలీవుడ్, హాలీవుడ్ను మించేలా జగన్నాటకాలు
మీ బలహీనతే జగన్ బలం. మద్యం ధరలు పెంచితే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి మోసం చేశారు. రూ.60 ఉన్న క్వార్టర్ బాటిల్ ఇప్పుడు రూ.200 అయింది. -
రేపటి నుంచి పవన్ కల్యాణ్ ఎన్నికల శంఖారావం
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తాను పోటీ చేయబోతున్న పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎన్నికల శంఖారావం పూరించబోతున్నారు. -
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిందే
కూటమి అభ్యర్థి ఎవరైనా గెలిపించాల్సిన బాధ్యత భాజపా కార్యకర్తలపై ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు. -
బరిలో 15 మంది మాజీ సీఎంలు
లోక్సభ ఎన్నికల్లో ఎన్డీయే, ఇండియా కూటముల తరఫున 15 మంది మాజీ ముఖ్యమంత్రులు పోటీపడుతున్నారు. ఇందులో 12 మంది ఎన్డీయే నుంచి, ముగ్గురు ఇండియా నుంచి కదన రంగంలో కాలుమోపుతున్నారు. -
ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బుస అనులేఖ
కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగం ఎన్ఎస్యూఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన బుస అనులేఖ నియమితులయ్యారు. -
ఎంపీగా లేకున్నా.. మీ బిడ్డగా సేవ చేస్తా
‘‘ఎంపీగా నా పదవీకాలం ముగిసినా.. మీతో నా అనుబంధం చివరిశ్వాస వరకు కొనసాగుతుంది. పీలీభీత్ ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు నేను ఎల్లప్పుడూ పనిచేస్తా. -
వివేకా హంతకులు మీ పక్కనే ఉన్నారని అందరికీ తెలుసు: వర్ల రామయ్య
మాజీ మంత్రి వైఎస్ వివేకాపై గొడ్డలి వేటు వేయించింది వైకాపా ఎంపీ అవినాష్రెడ్డి కాదా అని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
సీఎం బొమ్మలు ఉంచాల్సిందేనంటున్న ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోండి
పాస్ పుస్తకాలు, భూమి పత్రాలు, ల్యాండ్ పార్సిల్ మ్యాపులు ఇతర డాక్యుమెంట్లపై సీఎం జగన్ బొమ్మలు ఉంచాల్సిందేనని, నవరత్నాల లోగోను తొలగించవద్దని జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చిన ఉన్నతాధికారిపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ కోరారు. -
కాళేశ్వరం, కేసీఆర్పై ఈ ప్రభుత్వానికి కడుపు మంట
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరవు.. కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. -
భారాసకు భారీ షాక్
లోక్సభ ఎన్నికల వేళ భారాసకు షాక్ మీద షాక్ తగులుతోంది. సిటింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఆ పార్టీని వీడుతుండగా.. తాజాగా భారాస వరంగల్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి కడియం కావ్య పోటీ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు. -
సంక్షిప్త వార్తలు (7)
ఎన్డీయే తీరుపై భాగస్వామ్య పక్ష నేత, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎ) అధినేత, కేంద్ర మంత్రి రాందాస్ అఠావలె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
6న జైపుర్లో కాంగ్రెస్ మేనిఫెస్టో
లోక్సభ ఎన్నికలకు కాంగ్రెస్ మేనిఫెస్టోను వచ్చే నెల 6వ తేదీన రాజస్థాన్ రాజధాని జైపుర్లో విడుదల చేయనున్నట్లు ఆ పార్టీ నేత సుఖ్జీందర్ సింగ్ రణధావా తెలిపారు. -
జగన్పై ఒంటరిగానే నా పోరాటం
‘ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హైదరాబాద్లో ఉన్న సీబీఐ కోర్టును 3 వేల వాయిదాలు కోరారు. -
ఎమ్మెల్యే కాటసాని సోదరుడు చంద్రశేఖరరెడ్డితో తెదేపా మంతనాలు
నంద్యాల జిల్లా బనగానపల్లిలో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డితో గురువారం రాత్రి తెదేపా నేతలు బైరెడ్డి రాజశేఖరరెడ్డి, బీసీ జనార్దన్రెడ్డి మంతనాలు సాగించారు. -
‘సంగం’పై ఆర్వో ఎలా స్పందిస్తారు: ధూళిపాళ్ల
కంపెనీ చట్టంలో ఉన్న సంగం డెయిరీపై వైకాపా నాయకుడు ఫిర్యాదు చేస్తే ఎలా స్పందిస్తారని గుంటూరు జిల్లా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గ ఆర్వోను మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ ప్రశ్నించారు. -
గుంటూరు మిర్చియార్డులో వైకాపా అభ్యర్థుల ప్రచారం
ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వైకాపా గుంటూరు లోక్సభ అభ్యర్థి, పలు శాసనసభ నియోజకవర్గాల అభ్యర్థులు ఈ నెల 22న గుంటూరు మిర్చియార్డులో ప్రచారం నిర్వహించారని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనాకు యార్డు మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. -
వైకాపా సభ్యత్వానికి తిరుపతి కార్పొరేటర్ల రాజీనామా
ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ తిరుపతిలో వైకాపా అసంతృప్త నేతలు బయటపడుతున్నారు. -
వచ్చే నెల మొదటి వారంలో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటన!
రాష్ట్రంలో ఎన్నికల్లో పోటీచేసే కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను వచ్చే నెల మొదటి వారంలో ప్రకటించే అవకాశాలున్నాయి. -
పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన?
రాయలసీమలో అన్యాయాలు చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తిన పాపాల పెద్దిరెడ్డికి దళితులంటే ఎందుకంత చులకన భావమని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రశ్నించారు. -
శివసేన (శిందే)లో చేరిన నటుడు గోవిందా
సార్వత్రిక ఎన్నికల ముందు బాలీవుడ్ నటుడు గోవిందా (60) మరోసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. గురువారం ఆయన శివసేన (శిందే వర్గం) పార్టీలో చేరారు. -
కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కమిటీ
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ మ్యానిఫెస్టోను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు రాష్ట్ర పార్టీ ‘తెలంగాణ ప్రజల ముంగిట్లోకి జాతీయ మ్యానిఫెస్టో’ కమిటీని ఏర్పాటు చేసింది.