KTR: యశ్వంత్‌ సిన్హా నామినేషన్‌కు మంత్రి కేటీఆర్‌.. దిల్లీకి పయనం

విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌ కార్యక్రమానికి తెరాస హాజరుకానుంది...

Published : 27 Jun 2022 01:35 IST

హైదరాబాద్‌: విపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. నామినేషన్‌ కార్యక్రమానికి తెరాస హాజరుకానుంది. ఇందుకోసం తెరాస వర్కింగ్‌ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కె.తారకరామారావు దిల్లీకి బయలుదేరి వెళ్లారు. కేటీఆర్‌తో పాటు లోక్‌సభలో పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు రంజిత్‌రెడ్డి, సురేష్‌రెడ్డి, బీబీ పాటిల్‌, వెంకటేశ్‌నేత, ప్రభాకర్‌రెడ్డి తదితరులు దిల్లీ వెళ్లిన వారిలో ఉన్నారు. వీరంతా రేపు దిల్లీలో జరిగే రాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్‌ కార్యక్రమంలో  పార్టీ తరఫున పాల్గొంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు