Mallareddy: మరోసారి రేవంత్‌రెడ్డిపై విరుచుకుపడ్డ మల్లారెడ్డి

నాపై చేసిన ఆరోపణలు నిరూపించాలి.. ఆరోపణలు రుజువైతే నాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను.. లేదంటే రేవంత్‌ రాజీనామా చేయాలి..

Updated : 12 Oct 2022 15:39 IST

హైదరాబాద్‌: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి  తనపై చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ కార్మికశాఖ  మంత్రి మల్లారెడ్డి మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలని డిమాండ్‌ చేశారు. ఆరోపణలు నిజమైతే రాజీనామాకు సిద్ధమని, లేదంటే రేవంత్‌రెడ్డి రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు. పీసీసీ అధ్యక్షుడు అయినంతమాత్రాన నోటికొచ్చినట్టు మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు పద్ధతిగా మాట్లాడటం నేర్చుకోవాలని, తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఎంపీ అయి ఉండి సీఎం, మంత్రులను తిట్టడం మంచిదేనా అని ప్రశ్నించారు. మమ్మల్ని ఒకటంటే మేం వంద అంటాం అని హెచ్చరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని