Talasani: కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళితే.. మేం కూడా సిద్ధమే: తలసాని
కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళితే.. తాము కూడా ముందస్తుకు సిద్ధమేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర మోడల్గా రాష్ట్రాన్ని
హైదరాబాద్: కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళితే.. తాము కూడా ముందస్తుకు సిద్ధమేనని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. మహారాష్ట్ర మోడల్గా రాష్ట్రాన్ని చేస్తామంటే కుదరదని.. సై అంటే సై అంటామన్నారు. మర్యాద ఇచ్చి పుచ్చుకుంటామని.. ఎవరు ఎవరికీ భయపడరని భాజపానుద్దేశించి వ్యాఖ్యానించారు. బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలికేందుకు వచ్చిన సందర్భంలో తలసాని మీడియాతో మాట్లాడారు.
బేగంపేట విమానాశ్రయంలో ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం పలికేందుకు సీఎం కేసీఆర్ రాలేదన్న ప్రశ్నకు తలసాని స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా తాను వచ్చినట్టు చెప్పారు. తెరాస ప్లీనరీ జరిగినప్పుడు కూడా పార్టీ ఫ్లెక్సీలకు జీహెచ్ఎంసీ ఫైన్ వేసిందని, మంత్రికి కూడా జరిమానా విధించారని తలసాని తెలిపారు. భాజపా కార్యాలయంలో సీఎం కేసీఆర్పై ఒక డిజిటల్ ఫ్లెక్సీ పెట్టారని.. ఆ తర్వాతే బై బై మోదీ అని ఫ్లెక్సీలు పెట్టారని పేర్కొన్నారు. భాజపా కార్యవర్గ భేటీ పేరుతో హైదరాబాద్కు టూరిస్టులు వచ్చారని, ఇక్కడ జరిగిన అభివృద్ధి చూసి తెలుసుకుని వెళ్తారన్నారు. విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా వచ్చిన సందర్భంగా నిర్వహించిన ర్యాలీ కేవలం శాంపిల్ మాత్రమేనని ఇంకా చాలా ఉందని తెలిపారు. ‘‘తెరాస ప్రభుత్వాన్ని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని భాజపా నేతలు అడుగుతున్నారు. మేం అడుగుతున్నాం.. దేశ ప్రజలు కూడా కోరుకుంటున్నారు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కూడా ముందస్తు ఎన్నికలకు రావాలి. అన్నీ కలిపి ఒకేసారి నిర్వహిద్దాం. దేనికైనా మేం సిద్ధమే. దమ్ముంటే ఎన్నికల్లో తలపడాలి’’ అని తలసాని సవాల్ విసిరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
ఏపీలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్లపై బదిలీ వేటు