Andhra News: మంత్రి అవంతి పేషీలో ఇద్దరు అధికారుల ఘర్షణ

సచివాలయంలోని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేషీలో ఇద్దరు అధికారుల మధ్య ఘర్షణ తలెత్తింది.

Updated : 01 Apr 2022 16:03 IST

అమరావతి: సచివాలయంలోని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్‌ పేషీలో ఇద్దరు అధికారుల మధ్య ఘర్షణ తలెత్తింది. మంత్రి పేషీ నిర్వహణ విషయంలో పరస్పరం కలబడేంతగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఇటీవలే వచ్చిన ఓ ఉద్యోగి మంత్రి పేషీకి తాళాలు వేయడంపై ఇద్దరి మధ్యా వివాదం తలెత్తింది. కొంతకాలంగా మంత్రి పేషీలోని కార్యాలయానికి ఎవరూ వెళ్లకుండా తాళాలు వేస్తున్నట్లు సమాచారం. మరోవైపు అవంతి బంధువు ఆధీనంలోనే పేషీ నిర్వహణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. గమనించిన తోటి ఉద్యోగులు వారికి సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని