Gujarat elections: మోదీజీ కంగ్రాట్స్‌.. మా ప్రాజెక్టులు బాగానే పనికొచ్చాయ్‌గా: ఉద్ధవ్‌

Gujarat elections: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) విజయంపై శివసేన (UBT) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే తనదైన శైలిలో స్పందించారు. మోదీకి కంగ్రాట్స్‌ చెబుతూనే వ్యంగ్య బాణాలు సంధించారు.

Published : 09 Dec 2022 01:34 IST

ముంబయి: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో (Gujarat elections) భారతీయ జనతా పార్టీ (BJP) విజయంపై శివసేన (UBT) అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే తనదైన శైలిలో స్పందించారు. విజయంపై ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూనే.. మహారాష్ట్ర నుంచి తరలించిన ప్రాజెక్టులు గుజరాత్‌లో విజయానికి బాగానే ఉయోగపడ్డాయంటూ వ్యంగ్యబాణాలు సంధించారు.

‘‘గుజరాత్‌లో చరిత్రాత్మక విజయం సాధించిన భాజపాకు, ప్రధాని మోదీకి అభినందనలు. మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు తరలించిన ప్రాజెక్టులు విజయానికి దోహదపడ్డాయని భావిస్తున్నా’’ అని ఉద్ధవ్‌ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. డిసెంబర్‌ 11న మోదీ మహారాష్ట్రకు వస్తున్నారని, ముంబయి మున్సిపల్‌ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఏదైనా భారీ ప్రకటనే చేసే అవకాశం ఉందంటూ ఎద్దేవా చేశారు. గుజరాత్‌లో మరోసారి విజయం సాధించడానికి మోదీ నేతృత్వంలో ఎన్నికలు జరగడమే కారణమన్నారు. ఆమ్‌ఆద్మీ పార్టీ వల్ల భాజపా లాభపడిందని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు కొన్ని ప్రధాన ప్రాజెక్టులు మహారాష్ట్ర నుంచి గుజరాత్‌కు తరలించారంటూ పలు విపక్షాలు మోదీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని