Gujarat elections: మోదీజీ కంగ్రాట్స్.. మా ప్రాజెక్టులు బాగానే పనికొచ్చాయ్గా: ఉద్ధవ్
Gujarat elections: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (BJP) విజయంపై శివసేన (UBT) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తనదైన శైలిలో స్పందించారు. మోదీకి కంగ్రాట్స్ చెబుతూనే వ్యంగ్య బాణాలు సంధించారు.
ముంబయి: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో (Gujarat elections) భారతీయ జనతా పార్టీ (BJP) విజయంపై శివసేన (UBT) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే తనదైన శైలిలో స్పందించారు. విజయంపై ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలుపుతూనే.. మహారాష్ట్ర నుంచి తరలించిన ప్రాజెక్టులు గుజరాత్లో విజయానికి బాగానే ఉయోగపడ్డాయంటూ వ్యంగ్యబాణాలు సంధించారు.
‘‘గుజరాత్లో చరిత్రాత్మక విజయం సాధించిన భాజపాకు, ప్రధాని మోదీకి అభినందనలు. మహారాష్ట్ర నుంచి గుజరాత్కు తరలించిన ప్రాజెక్టులు విజయానికి దోహదపడ్డాయని భావిస్తున్నా’’ అని ఉద్ధవ్ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. డిసెంబర్ 11న మోదీ మహారాష్ట్రకు వస్తున్నారని, ముంబయి మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఏదైనా భారీ ప్రకటనే చేసే అవకాశం ఉందంటూ ఎద్దేవా చేశారు. గుజరాత్లో మరోసారి విజయం సాధించడానికి మోదీ నేతృత్వంలో ఎన్నికలు జరగడమే కారణమన్నారు. ఆమ్ఆద్మీ పార్టీ వల్ల భాజపా లాభపడిందని అభిప్రాయపడ్డారు. ఎన్నికలకు ముందు కొన్ని ప్రధాన ప్రాజెక్టులు మహారాష్ట్ర నుంచి గుజరాత్కు తరలించారంటూ పలు విపక్షాలు మోదీపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్