Uddhav Thackeray: శరద్ పవార్ రాజీనామాపై స్పందించిన ఉద్ధవ్ ఠాక్రే
Uddhav Thackeray: ఎన్సీపీ అధ్యక్ష పదవికి శరద్పవార్ రాజీనామా వ్యవహారంపై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు.
ముంబయి: ఎన్సీపీ (NCP) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్(Sharad Pawar) తీసుకున్న నిర్ణయంపై మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పందించారు. పవార్ రాజీనామా వ్యవహారం కాంగ్రెస్, ఎన్సీపీ శివసేన(ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే)లతో కూడిన మహా వికాస్ అఘాడీ(MVA) కూటమిపై ఎలాంటి ప్రభావం ఉండదన్నారు. గురువారం ఆయన ముంబయిలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షాల ఐక్యతను దెబ్బతీసే ఏ పనీ తాను చేయబోనన్నారు. ప్రధాని నరేంద్ర మోదీకి తాను వ్యతిరేకం కాదన్న ఉద్ధవ్.. నియంతృత్వానికి మాత్రం పూర్తి వ్యతిరేకమని స్పష్టంచేశారు. ఎన్సీపీలో జరుగుతున్న పరిణామాలు మహా వికాస్ అఘాడీ కూటమికి ఎలాంటి నష్టం చేయవన్నారు. ఎన్సీపీ చీఫ్గా వైదొలుగుతూ పవార్ తీసుకున్న నిర్ణయంపై స్పందించేందుకు మాత్రం ఆయన నిరాకరించారు.
ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తూ శరద్ పవార్ అనూహ్య నిర్ణయం తీసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. దీంతో ఆ పార్టీ శ్రేణులు షాక్కు గురయ్యాయి. కొందరు రాజీనామాలు చేస్తామని హెచ్చరించగా.. ఇంకొంతమంది నిరాహార దీక్షలకు దిగుతామంటూ బెదిరింపులకు పాల్పడినా పవార్ తన నిర్ణయం నుంచి వెనక్కి తగ్గలేదు. అలాగే, పార్టీలో క్రియాశీలంగా ఉంటానని, అధ్యక్ష పదవి నుంచి మాత్రమే వైదొలిగానని ఆయన స్పష్టంచేశారు. అయితే, పవార్ రాజీనామాతో తదుపరి అధ్యక్ష పదవి ఎవరికి అప్పగిస్తారనే అంశం ఉత్కంఠగా మారింది. శుక్రవారం ముంబయిలో జరిగే పార్టీ కీలక సమావేశంలో ఈ వ్యవహారంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?