Maharashtra crisis: ఉద్ధవ్ ఠాక్రే రెండుసార్లు రాజీనామా చేయాలనుకున్నారు.. కానీ..!
మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా విషయమై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ముంబయి: మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం(Maharashtra crisis) కొనసాగుతున్న వేళ శివసేన(Shiv Sena) అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) రాజీనామా విషయమై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెబల్ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సీఎం పదవికి ఆయన రెండుసార్లు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని పార్టీ అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ‘మహా’ కూటమిలోని ఓ సీనియర్ నేత చెప్పడంతోనే ఆయన వెనక్కి తగ్గినట్లు సమాచారం. ‘‘శివసేన అధినేత ఒకసారి కాదు రెండుసార్లు రాజీనామా చేయాలనుకున్నారు. కానీ, ఓ సీనియర్ నేత చెప్పడంతో ఆయన రాజీనామా చేయకుండా ఆగిపోయారు’’ అని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంపై తిరుగుబావుటా ఎగురవేసి తనకు మద్దతు తెలిపే ఎమ్మెల్యేలతో ఏక్నాథ్ శిందే(Eknath Shinde) జూన్ 21(గత మంగళవారం)న గుజరాత్లోని సూరత్కు వెళ్లిన విషయం తెలిసిందే. అదే రోజున సీఎం పదవికి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారట. ఈ విషయాన్ని ఫేస్బుక్ లైవ్లో ప్రకటించాలనుకున్నారని తెలిసింది. కానీ, మహా వికాస్ అఘాడీ కూటమికి చెందిన సీనియర్ నాయకుడు ఠాక్రేను రాజీనామా చేయకుండా ఒప్పించారని అధికార వర్గాల సమాచారం.
తర్వాత రోజున ఉద్ధవ్ ఠాక్రే మళ్లీ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాలని నిర్ణయించుకున్నారని పార్టీ వర్గాల సమాచారం. ‘మహా’ కూటమిలోని ముఖ్య నేతలతో చర్చించి తన నిర్ణయాన్ని వెల్లడించాలనుకున్నారట. అప్పుడు కూడా ఠాక్రే ఉద్దేశాన్ని గమనించిన ఆ సీనియర్ నేత రంగంలోకి దిగారట. ఆరోజు సైతం ఫేస్బుక్ ద్వారా సాయంత్రం 4గంటలకు రాజీనామా ప్రకటిస్తారని అందరూ అనుకున్నారు. కానీ, ఫేస్బుక్ లైవ్ అరగంట ఆలస్యం అయ్యింది. దీనికి కారణం కూటమిలోని సీనియర్ నేత ఠాక్రేతో మాట్లాడి రాజీనామా ప్రకటించవద్దని ఆయనను ఒప్పించారని తెలిసింది.
ఉద్ధవ్ ఠాక్రే ఫేస్బుక్ లైవ్లో మాట్లాడుతూ.. రాజీనామా లేఖతో సిద్ధంగా ఉన్నానని చెప్పారు. అయితే, రెబల్ ఎమ్మెల్యేలు వచ్చి తను రాజీనామా చేయాలని కోరితే కచ్చితంగా చేస్తానన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో ఒకరైనా తన మీద ఫిర్యాదు చేస్తే సీఎం పదవి నుంచి వైదొలుగుతానని చెప్పారు. ఇది జరిగిన కాసేపటికే ఉద్ధవ్ ఠాక్రే తన అధికార నివాసం ‘వర్ష’ను వీడి తన స్వగృహం ‘మాతోశ్రీ’కి వెళ్లిపోయారని పార్టీ అధికార వర్గాలు తెలిపాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భాజపా వైపు ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
ఇది వారణాసి, వయనాడ్ మధ్య పోరాటం
తెలంగాణ నుంచి పోటీ చేయాలని రాహుల్గాంధీని తాము కోరినా వయనాడ్ వైపే మొగ్గు చూపారని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. కేరళ రాష్ట్రం వయనాడ్లో కాంగ్రెస్ పార్టీ గురువారం నిర్వహించిన రైతుల సమావేశంలో ఆయన ప్రసంగించారు. -
రాహుల్ను ప్రధానిని చేయాలి: తుమ్మల
పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 15 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని... రాహుల్గాంధీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ కార్యకర్తలను కోరారు. -
మాదిగలకు కాంగ్రెస్ రెండు పార్లమెంట్ సీట్లు కేటాయించాలి
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ మాదిగలకు రెండు సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హైదరాబాద్లో అమీర్పేట లీలానగర్లోని తన నివాసంలో గురువారం నిరసన దీక్ష చేపట్టారు. -
భాజపాను అడ్డుకుంటేనే రేవంత్కు, లౌకికవాదానికి మంచిది
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ఇంట గెలిచిన తర్వాత రచ్చ గెలవాలని.. కేరళకు వెళ్లి ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న వామపక్షాలపై ఆయన నోరు పారేసుకోవడం సరైంది కాదని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. -
రేవంత్రెడ్డికి ఓట్లడిగే హక్కు లేదు: లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని రాజ్యసభ సభ్యుడు, భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డా.లక్ష్మణ్ విమర్శించారు. -
రైతుల ఉసురు పోసుకుంటున్న కాంగ్రెస్
రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, వరి, మొక్కజొన్న పంటలకు రూ.500 బోనస్ ఇస్తామంటూ బోగస్ మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. నాలుగు నెలల్లోనే కర్షకుల ఉసురు పోసుకుంటోందని, వారిని వేదనకు గురిచేస్తోందని భారాస సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. -
భాజపాతోనే వికసిత తెలంగాణ: గోవా సీఎం
గత పదేళ్లలో తెలంగాణను భారాస అధినేత కేసీఆర్ దోపిడీ చేస్తే.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కొల్లగొడుతోందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్సావంత్ ఆరోపించారు. -
ఈటల సేవలు దేశానికి అవసరం
కరోనా సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రజలకు సేవలందించిన ఈటల రాజేందర్ను లోక్సభ ఎన్నికల్లో గెలిపించి దేశవ్యాప్తంగా ఆయన సేవలు విస్తరిద్దామని కేంద్ర పట్టణాభివృద్ధి, పెట్రోలియం శాఖల మంత్రి హర్దీప్సింగ్ పురి అన్నారు. -
రత్నగిరి-సింధుదుర్గ్ భాజపా అభ్యర్థిగా నారాయణ్ రాణె
కేంద్రమంత్రి నారాయణ్ రాణెను మహారాష్ట్రలోని రత్నగిరి-సింధుదుర్గ్ లోక్సభ స్థానం నుంచి బరిలో దింపాలని భాజపా నిర్ణయించింది. -
భారాస నాయకులను చేర్చుకోవద్దు
భారాస నాయకులను కాంగ్రెస్లో చేర్చుకోవద్దంటూ వనపర్తి జిల్లా గోపాల్పేట మండల పార్టీ అధ్యక్షుడు గణేశ్గౌడ్, నాయకుడు శేఖర్ వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఎదుటే పెట్రోలు పోసుకుని నిరసనకు దిగారు. -
అమ్మ మరణాన్ని తట్టుకోలేకపోతున్నా
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు హిమాచల్ప్రదేశ్ డిప్యూటీ సీఎం ముకేశ్ అగ్నిహోత్రి కుమార్తె ఆస్తా అగ్నిహోత్రి విముఖత వ్యక్తం చేశారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
కృష్ణుడి గోపికను నేనే హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
ఎన్నికల కమిషన్ కాదు.. భాజపా కమిషన్: మమత
ముర్షీదాబాద్ రామనవమి ర్యాలీలో చోటు చేసుకున్న హింసపై పశ్చిమబెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్, భాజపాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. -
ఢీకొడుతున్న ఇండియా!
రాజస్థాన్లోని 12 స్థానాలకు తొలి విడతలో భాగంగా శుక్రవారం పోలింగ్ జరగనుంది. 2,53,15,541 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
పశ్చిమ పవర్ ఎవరిది?
సార్వత్రిక ఎన్నికల్లో అత్యంత కీలక రాష్ట్రం ఉత్తర్ ప్రదేశ్. ఇక్కడ ఆధిక్యం సాధించే పార్టీయే దాదాపుగా కేంద్రంలో అధికారంలోకి వస్తుంది. -
నాపై కొన్ని మీడియా సంస్థల నిందలు
కేంద్ర ప్రభుత్వం, భాజపాల విధానాలు, సిద్ధాంతాలపై విమర్శలు చేస్తున్నందుకు తనను కొన్ని మీడియా సంస్థలు నిందిస్తున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. -
తొలిదశ సమరం నేడే
లోక్సభ ఎన్నికల్లో తొలిదశ కింద 102 స్థానాల్లో శుక్రవారం పోలింగు నిర్వహించేందుకు రంగం సిద్ధమైంది. ఏడు దశల్లో ఇదే అతిపెద్దది. -
నాలుగోదశకు మొదలైన నామినేషన్లు
లోక్సభ ఎన్నికల నాలుగో దశకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. మే 13న జరగబోయే పోలింగ్ కోసం కేంద్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్ వెలువరించింది. -
‘ఇండియా’ కూటమి నేతల బెదిరింపులను కట్టడి చేయాలి
కాంగ్రెస్ సహా ‘ఇండియా’ కూటమి నేతల భాష దూషణలు, బెదిరింపులతో కూడుకొని ఉంటోందని, ఈసీ వాటిని సుమోటోగా పరిగణనలోకి తీసుకొని తగిన చర్యలు తీసుకోవాలని భాజపా గురువారం డిమాండ్ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు