Udhayanidhi Stalin: తమిళనాడు మంత్రివర్గంలోకి వారసుడు.. మంత్రిగా ఉదయనిధి!
స్టాలిన్ తనయుడు, నటుడు ఉదయనిధి స్టాలిన్ కేబినెట్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఏడాదిగా ఎమ్మెల్యేగా ఉన్న ఆయన త్వరలోనే మంత్రి పదవి చేపట్టనున్నారు.
చెన్నై: తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గంలో కీలక మార్పు చోటుచేసుకోనుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, డీఎంకే (DMK) యువజన విభాగం అధ్యక్షుడు, సినీ నటుడు ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) మంత్రివర్గంలోకి అడుగు పెట్టబోతున్నారు. చెపాక్-తిరువల్లికేని నియోజకవర్గం నుంచి 2021లో విజయం సాధించిన ఉదయ నిధి స్టాలిన్.. ఏడాదిగా ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రభుత్వ పదవిలోనూ లేరు. ఈ నేపథ్యంలోనే ఆయనను త్వరలోనే మంత్రి వర్గంలోకి తీసుకోనున్నారు. డిసెంబర్ 14న ఆయన మంత్రివర్గంలోకి చేరుతారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ఉదయనిధి స్టాలిన్ను తీసుకోవడంతో పాటు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కూడా జరిగే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. దీనిపై పార్టీ అధికార ప్రతినిధి రవీంద్రన్ స్పందిస్తూ.. ఉదయనిధి మంత్రి కావాలని పార్టీ నేతలు చాలా రోజుల నుంచి కోరుకుంటున్నారని చెప్పారు. అయితే, అది సీఎం స్టాలిన్ చేతిలోనే ఉందని పేర్కొన్నారు. యువతను ఆకట్టుకునే కీలక విభాగానికి ఉదయనిధిని మంత్రిని చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. దీనిబట్టి ఉదయనిధికి యువజన, క్రీడా మంత్రిత్వశాఖ బాధ్యతలు అప్పగిస్తారని అంచనా. మంత్రి పదవి గురించి ఉదయనిధిని విలేకరులు ప్రశ్నించగా.. సమాధానం దాటవేశారు. ఈ వార్తలపై అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పళని స్వామి సైతం స్పందించారు. డీఎంకే కుటుంబ పార్టీగా మారిపోయిందంటూ ఎద్దేవా చేశారు. ఇక సీనియర్లకు డమ్మీ శాఖలను కేటాయించబోతున్నారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్