Karnataka: 135 మంది ఎమ్మెల్యేల మద్దతు నాకే..: డీకే శివకుమార్
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి విషయంలో సిద్ధరామయ్య, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. అయితే, తన అధ్యక్షతన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 135 సీట్లు గెలుచుకుందని, వారందరి మద్దతు తనకే ఉందని శివకుమార్ వ్యాఖ్యానించారు.
బెంగళూరు: కర్ణాటక (Karnatka) తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఎంపికవుతారనేది ఉత్కంఠగా మారిన విషయం తెలిసిందే. ఈ పదవి విషయంలో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ (DK Shivakumar)ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈ విషయమై చర్చలకు అధిష్ఠానం నుంచి పిలుపు రాగా.. సిద్ధరామయ్య ఇప్పటికే దిల్లీ (Delhi)కి చేరుకున్నారు. ఈ క్రమంలోనే డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన అధ్యక్షతన కర్ణాటకలో కాంగ్రెస్ (Congress) పార్టీ 135 సీట్లు గెలుచుకుందని, వారందరి మద్దతు తనకే ఉందన్నారు.
‘సీఎం ఎంపిక అంశాన్ని అధిష్ఠానానికి వదిలేస్తామని సీఎల్పీ సమావేశంలో తీర్మానం చేశాం. ఆ తర్వాత కొందరు వారి వ్యక్తిగత అభిప్రాయాలను పంచుకున్నారు. ఇతరుల సంఖ్యాబలం గురించి మాట్లాడను. కానీ, నా సంఖ్యాబలం 135. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నా ఆధ్వర్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ.. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం, అవినీతి పాలనకు వ్యతిరేకంగా పోరాడి 135 సీట్లు సాధించింది. క్షేత్రస్థాయి నుంచి మరింత సహకారం వచ్చి ఉంటే సీట్లు పెరిగేవి. కానీ, ఫలితాల విషయంలో మేం సంతోషంగా ఉన్నాం’ అని శివకుమార్ మాట్లాడారు. ‘నేను ఒంటరి మనిషిని. ధైర్యం కలిగిన ఒక్క వ్యక్తి.. మెజారిటీ సాధించగలడని నమ్ముతా. నిరూపించాను కూడా. 2019లో అనేకమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడినా.. ఆత్మవిశ్వాసం కోల్పోలేదు’ అని వ్యాఖ్యానించారు.
మరోవైపు ఇటీవల బెంగళూరులో నిర్వహించిన సీఎల్పీ సమావేశంలో పరిశీలకులుగా వ్యవహరించిన సుశీల్ కుమార్ షిండే, జితేంద్ర సింగ్, దీపక్ బబారియాలు.. దిల్లీలో పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇంటికి చేరుకున్నారు. సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేలు వ్యక్తపరిచిన అభిప్రాయాలతో కూడిన నివేదికను ఈ సందర్భంగా ఖర్గేకు సమర్పించినట్లు సమాచారం. అయితే, అంతకుముందు తాను దిల్లీ వెళతానని పేర్కొన్న డీకే.. గంటల వ్యవధిలో మాట మార్చారు. సీఎం అభ్యర్థి నిర్ణయాన్ని పార్టీ అధిష్ఠానానికే వదిలేశానని, అనారోగ్య కారణాల వల్ల తాను దిల్లీ వెళ్లట్లేదన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జనసేన పెండింగ్ స్థానాలపై పవన్ కల్యాణ్ కసరత్తు
జనసేన పెండింగ్ స్థానాలపై ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కసరత్తు కొనసాగుతోంది. -
మమత, కంగనలపై వ్యాఖ్యల దుమారం.. దిలీప్ ఘోష్, సుప్రియా శ్రీనేత్లకు ఈసీ షోకాజ్ నోటీసులు
భాజపా ఎంపీ దిలీప్ ఘోష్, కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్లకు కేంద్ర ఎన్నికల సంఘం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. -
యువత కోసం 20లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి: చంద్రబాబు
యువత కోసం 20లక్షల ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. -
ఫోన్ ట్యాపింగ్పై నేను చెప్పిందే నిజమైంది: రఘునందన్రావు
తెలంగాణలో రాజకీయ నాయకుల ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై రాష్ట్ర డీజీపీకి భాజపా నేత రఘునందన్రావు ఫిర్యాదు చేశారు. -
సీట్ల సర్దుబాటు వేళ.. ఉద్ధవ్ వర్గం, కాంగ్రెస్ మధ్య ‘కిచిడీ’ చిచ్చు
ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) వర్గం నేతపై కాంగ్రెస్ నాయకుడు సంజయ్ నిరుపమ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
మహువా ప్రత్యర్థి రాజమాతకు మోదీ ఫోన్
భాజపా అభ్యర్థి రాజమాత అమృతారాయ్ (Amrita Roy)తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ (Modi).. దేశంలో అవినీతి నిర్మూలనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. -
వైకాపా డంప్లు బట్టబయలైనా చర్యలేవీ?: అచ్చెన్నాయుడు
రేణిగుంట ఎఫ్సీఐ గోదాం వద్ద వైకాపా నేతల నగదు, మద్యం, ప్రచార సామగ్రికి సంబంధించిన డంప్లు బట్టబయలైనా ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్: కేటీఆర్
పదేళ్ల నిజం భారాస.. వంద రోజుల అబద్ధం కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
ముసుగు వీరుడు వస్తున్నాడు.. ఇంటికి పంపేందుకు మేమూ సిద్ధమే: చంద్రబాబు
వైకాపా పాలనలో రాయలసీమను రాళ్లసీమగా మార్చారని తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) విమర్శించారు. ఎన్నికల్లో (Andhra Pradesh Assembly elections) ఓటు అడిగే అర్హత ఆ పార్టీ నేతలకు లేదన్నారు. -
వీహెచ్కు బుజ్జగింపులు.. అండగా ఉంటానని సీఎం రేవంత్ భరోసా
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. ఇటీవల ఆయన ఖమ్మం లోక్సభ టికెట్ను ఆశించారు. -
సీట్ల సర్దుబాటుపై కూటమి చర్చల వేళ.. ఉద్ధవ్ పార్టీ తొలి జాబితా విడుదల
Shiva Sena (UBT): శివసేన (యూబీటీ) పార్టీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. -
ఆ కంటెయినర్లో ఏముంది?బ్రెజిల్ సరకా.. మద్యంలో మెక్కిన రూ.వేలకోట్లా?: నారా లోకేశ్
రోజూ తన కాన్వాయ్ను తనిఖీ చేస్తున్న పోలీసులకు ఒక్కటైనా ఎన్నికల నిబంధన ఉల్లంఘన కనిపించిందా అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రశ్నించారు. -
చీరాల వైకాపాలో ముసలం
బాపట్ల జిల్లా చీరాల వైకాపాలో ముసలం రేగింది. స్థానికులకే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. -
నా ఫోన్నూ ట్యాప్ చేశారు: బండి సంజయ్
గత భారాస ప్రభుత్వం తన ఫోన్ను ట్యాప్ చేయించిందని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. -
సభకు హాజరులో తెదేపా ఎంపీలదే అగ్రస్థానం
లోక్సభకు హాజరుకావడంలో తెదేపా ఎంపీలు దేశంలోని మిగతా అన్ని పార్టీల ఎంపీల కంటే ముందు వరుసలో ఉన్నారు. -
జనసేనకు పవన్కల్యాణ్ రూ.10 కోట్ల విరాళం
జనసేన పార్టీ అధినేత పవన్కల్యాణ్.. ఆ పార్టీ అవసరాలకు రూ.10 కోట్ల విరాళాన్ని అందించారు. మంగళవారం ఆయన.. పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సమక్షంలో కోశాధికారి ఏవీ.రత్నానికి చెక్కు అందజేశారు. -
శింగనమలలో భగ్గుమన్న వైకాపా అసమ్మతి
అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గ వైకాపాలో అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులును మార్చకపోతే ఓడించేందుకు సిద్ధంగా ఉన్నామని పార్టీ నాయకులు హెచ్చరించారు. -
10 రోజులకే మార్చారు!
వైకాపా 175 శాసనసభా నియోజకవర్గాల అభ్యర్థుల జాబితా ప్రకటించిన 10 రోజులకే ముఖ్యమంత్రి జగన్ అందులో మళ్లీ మార్పులు చేశారు. -
బ్రెజిల్ నుంచి వచ్చిన కంటెయినర్తో విజయసాయిరెడ్డికి సంబంధం
మాదకద్రవ్యాలతో బ్రెజిల్ నుంచి విశాఖపట్నం పోర్టుకు వచ్చిన డ్రైడ్ ఈస్ట్ కంటెయినర్తో విజయసాయిరెడ్డికి కచ్చితంగా సంబంధం ఉందని తెదేపా అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. -
8 మంది ఎవరో?
లోక్సభ ఎన్నికలకు రాష్ట్రంలోని 17 నియోజకవర్గాలకుగాను ఇప్పటికే 9 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన కాంగ్రెస్.. మిగిలిన 8 మందిని బుధవారం ఎంపిక చేయనుంది. -
మొన్నటివరకు చెట్లు తొలగించారు.. ఇప్పుడు ఇళ్లు పీకేస్తారు
‘ముఖ్యమంత్రి జగన్ వస్తున్నారంటే మొన్నటివరకు రోడ్డు పక్కనున్న చెట్లు తొలగించారు.. ఆయన హెలికాప్టర్లో తిరిగితే బస్సులు, బడులు చివరకు రోడ్డుపై రాకపోకలూ నిలిపేశారు.
తాజా వార్తలు (Latest News)
-
దిల్లీ హైకోర్టులో కేజ్రీవాల్కు దక్కని ఊరట
-
హైకోర్టుల్లోనూ మౌలిక సౌకర్యాల కొరత: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఒక్క ఓటరు కోసం.. 39 కి.మీ. ట్రెక్కింగ్కు పోలింగ్ సిబ్బంది రెడీ!
-
30 ఏళ్ల క్రితం సచిన్ ఆట మొదలైంది ఈ రోజే..!
-
జనసేన పెండింగ్ స్థానాలపై పవన్ కల్యాణ్ కసరత్తు
-
మయన్మార్ సరిహద్దుల్లో కంచె.. రూ.30,000 కోట్ల ఖర్చు..!