Guntur: ఏపీలో కేంద్ర పథకాలకు ప్రధాని మోదీ ఫొటో వేయరా?: కేంద్ర మంత్రి భారతీ పవార్
ఏపీ ప్రభుత్వం తీరుపై కేంద్ర మంత్రి భారతీ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 60శాతం నిధులు కేంద్రం ఇస్తున్నా ఆ పథకాలకు సైతం ప్రధాని ఫొటో వేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు.
గుంటూరు: కేంద్ర ప్రభుత్వ పథకాలకు సైతం ప్రధాని ఫొటో వేయకుండా ఏపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని కేంద్రమంత్రి భారతీ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 60శాతం నిధులు కేంద్రం ఇస్తున్నా ఏపీ ప్రభుత్వం ఇలా చేయటం ఏం బాగోలేదన్నారు. గుంటూరులోని హిందూ ఫార్మసీ కాలేజీలో జరిగిన భాజపా జిల్లా బూత్ స్థాయి కార్యకర్తల శిక్షణా సమావేశానికి కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన భారతీ పవార్.. ప్రధాని మోదీ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతోందన్నారు. సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ నినాదాన్ని కార్యకర్తలే ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జేపీ నడ్డా మార్గదర్శనంలో గ్రామ గ్రామానికి భాజపాను తీసుకెళ్తామన్నారు. జిల్లా, మండల స్థాయిల్లో సమావేశాలు నిర్వహించి కేంద్రం రాష్ట్రానికి ఏం చేస్తుందో వివరిస్తామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
లండన్లో ఖలిస్థానీ అనుకూలవాదుల దుశ్చర్య కేసు.. కీలక నిందితుడి అరెస్టు
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట