Guntur: ఏపీలో కేంద్ర పథకాలకు ప్రధాని మోదీ ఫొటో వేయరా?: కేంద్ర మంత్రి భారతీ పవార్‌

ఏపీ ప్రభుత్వం తీరుపై కేంద్ర మంత్రి భారతీ పవార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు. 60శాతం నిధులు కేంద్రం ఇస్తున్నా ఆ పథకాలకు సైతం ప్రధాని ఫొటో వేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే ప్రచారం చేసుకుంటోందని విమర్శించారు. 

Updated : 25 Feb 2023 17:16 IST

గుంటూరు: కేంద్ర ప్రభుత్వ పథకాలకు సైతం ప్రధాని ఫొటో వేయకుండా ఏపీ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోందని కేంద్రమంత్రి భారతీ పవార్‌ అసంతృప్తి వ్యక్తం చేశారు.  60శాతం నిధులు కేంద్రం ఇస్తున్నా ఏపీ ప్రభుత్వం ఇలా చేయటం ఏం బాగోలేదన్నారు. గుంటూరులోని హిందూ ఫార్మసీ కాలేజీలో జరిగిన భాజపా జిల్లా బూత్‌ స్థాయి కార్యకర్తల శిక్షణా సమావేశానికి కేంద్ర మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన భారతీ పవార్‌.. ప్రధాని మోదీ పాలనలో అన్ని వర్గాల అభివృద్ధి జరుగుతోందన్నారు. సబ్‌ కా సాథ్‌.. సబ్‌ కా వికాస్‌ నినాదాన్ని కార్యకర్తలే ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. జేపీ నడ్డా మార్గదర్శనంలో గ్రామ గ్రామానికి భాజపాను తీసుకెళ్తామన్నారు. జిల్లా, మండల స్థాయిల్లో సమావేశాలు నిర్వహించి కేంద్రం రాష్ట్రానికి ఏం చేస్తుందో వివరిస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు