Maharashtra crisis: ప్రతిపక్షంలో మేమింకా 2-3 రోజులే.. భాజపా మంత్రి కీలక వ్యాఖ్యలు..!
మహారాష్ట్రలో రాజకీయంగా ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతున్నాయి.
(ఫైల్ ఫొటో)
ముంబయి: మహారాష్ట్ర(Maharashtra)లో ఉత్కంఠ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే వర్గం ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుండగా.. అసమ్మతి ఏక్నాథ్ శిందే వర్గం హోటల్లో కూర్చొనే తదుపరి కార్యాచరణకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి రావ్ సాహెబ్ దన్వే(Raosaheb Danve) చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
‘నేను రెండున్నరేళ్లుగా కేంద్రమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నాను. తోపే సాహెబ్(మహారాష్ట్ర కెబినేట్ మంత్రి రాజేశ్ తోపే) రాష్ట్ర మంత్రి. మీరు 14 ఏళ్లుగా మంత్రిగా పనిచేస్తున్నారు. ఇక మీ పని ముగించండి. సమయం మించిపోతోంది. మేమింక రెండు మూడు రోజులు మాత్రమే ప్రతిపక్షంలో ఉంటాం’ అంటూ దన్వే వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జల్నాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోతుందని సూచనగా చెప్తూ ఈ మాటలన్నారు. ఆ సమయంలో రాజేశ్ తోపే అదే వేదికపై ఉండటం గమనార్హం. ఇదే సమయంలో శివసేనలో చెలరేగిన అసమ్మతికి తమకు ఏ సంబంధం లేదని మరోసారి వెల్లడించారు. అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను ముఖ్యమంత్రి.. ఎన్సీపీ, కాంగ్రెస్కు మళ్లించడమే అసమ్మతి నేతల ఆగ్రహానికి కారణమని చెప్పారు. రాజేశ్ తోపే.. ఎన్సీపీకి చెందిన నేత. సంకీర్ణ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖమంత్రిగా ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి