Andhra News: బోరుగడ్డ అనిల్‌ కార్యాలయాన్ని తగులబెట్టిన దుండగులు

రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్‌ (Borugadda Anil) కార్యాలయాన్ని దుండగులు తగులబెట్టారు. 

Updated : 07 Feb 2023 10:17 IST

గుంటూరు: రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు బోరుగడ్డ అనిల్‌ (Borugadda Anil) కార్యాలయాన్ని దుండగులు తగులబెట్టారు. సోమవారం అర్ధరాత్రి దాటాక గుంటూరులోని డొంకరోడ్డులో ఉన్న ఆయన క్యాంపు కార్యాలయంపై పెట్రోలు చల్లి నిప్పంటించారు. మంటల్లో అక్కడి ఫర్నీచర్‌ పూర్తిగా కాలిపోయింది. ఇటీవల నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని ఫోన్‌లో అనిల్‌ బెదిరించిన విషయం తెలిసిందే. సీఎం జగన్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడితే రోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్తానని ఆయన వ్యాఖ్యానించారు. 

తన కార్యాలయాన్ని తగులబెట్టిన ఘటనపై బోరుగడ్డ అనిల్‌ ఓ వీడియోను విడుదల చేశారు. ఇది ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పనేనని ఆయన ఆరోపించారు. కోటంరెడ్డికి గుంటూరు జిల్లా తెదేపా నేతలు కొందరు సహకరించినట్లు పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు