UP Polls: మంత్రి కొడుకు డబ్బులు పంచుతున్న వీడియో వైరల్.. ఈసీ సీరియస్!
యూపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ప్రజల్ని తమవైపు ఆకర్షించి ఓట్లు కొల్లగొట్టేందుకు రాజకీయ పార్టీల ప్రయత్నాలు.......
బులంద్షెహర్: యూపీలో ఎన్నికల సమయం దగ్గరపడుతున్న వేళ ప్రజల్ని తమవైపు ఆకర్షించి ఓట్లు కొల్లగొట్టేందుకు రాజకీయ పార్టీల ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో యూపీ మంత్రి, ఈ ఎన్నికల్లో శిఖర్పూర్ నుంచి భాజపా తరఫున బరిలో నిలిచిన అనిల్ శర్మ తనయుడు ప్రజలకు డబ్బుల పంచుతున్న వీడియో ఒకటి వైరల్గా మారింది. దీంతో ఎన్నికల సంఘం అధికారులు సీరియస్ అయ్యారు. ఈ ఘటనపై 24గంటల్లోగా వివరణ ఇవ్వాలంటూ మంత్రిని శిఖర్పూర్ రిటర్నింగ్ అధికారి కోరారు. మంత్రి శర్మ తనయుడు కుష్ తన వాహనం వద్ద డప్పుల చప్పుళ్ల మధ్య ప్రజలకు రూ.100 నోట్లు పంచుతున్నట్టుగా ఈ వీడియోలో రికార్డయి ఉంది. దీంతో రిటర్నింగ్ అధికారి మంత్రి శర్మకు నోటీసులు ఇచ్చారు. ఆయనకు చెందిన పార్టీ వారు ఆ ప్రాంతంలో డబ్బులు పంచుతున్నారనీ.. ఇది ప్రాథమికంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ఈ అంశంపై 24గంటల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలంటూ మంత్రికి నోటీసులు జారీచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?
-
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. నిందితులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు
-
మన దగ్గర ఇదే సమస్య.. హార్దిక్ గురించి పిల్లలకూ చెబుతాం: వసీమ్ అక్రమ్