UP Polls: నాలుగో విడతకు సిద్ధమైన యూపీ.. కీలకంగా లఖింపుర్ ఖేరీ
ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నాడు నాలుగో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది.
59 అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్
లఖ్నవూ: ఉత్తర్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నాడు నాలుగో విడత పోలింగ్కు సర్వం సిద్ధమైంది. 9 జిల్లాల పరిధిలోని 59 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరుగనుండగా.. మొత్తం 624 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. పిలిభిత్, లఖింపుర్ ఖేరీ, సీతాపుర్, హర్దోయ్, ఉన్నావ్, లఖ్నవూ, రాయ్బరేలీ, బందా, ఫతేపుర్ జిల్లాల్లో నాలుగో విడత ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో ఇటీవల లఖింపుర్లో సంచలనం సృష్టించిన రైతులపై కారు దాడి ఘటన ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం కనిపిస్తోంది.
59 అసెంబ్లీ స్థానాల్లో గత ఎన్నికల్లో (2017)లో 51 స్థానాలను భాజపా కైవసం చేసుకుంది. నాలుగు స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ, మూడుచోట్ల బహుజన్ సమాజ్ పార్టీ గెలుచుకోగా అప్నాదళ్ ఒక స్థానంలో గెలుపొందింది. కాగా ఈసారి మాత్రం వివిధ పార్టీ మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఈ విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు బరిలో ఉన్నారు. లఖ్నవూ కంటోన్మెంట్ నుంచి భాజపా అభ్యర్థిగా న్యాయశాఖ మంత్రి బ్రిజేశ్ పాఠక్ పోటీలో ఉన్నారు. అంతకుముందు ఆయన లఖ్నవూ సెంట్రల్ నుంచి గెలుపొందారు. లఖ్నవూ తూర్పు స్థానం నుంచి మరో మంత్రి అశుతోష్ టాండన్ పోటీ చేస్తున్నారు. ఆయన ప్రత్యర్థిగా సమాజ్వాదీ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అనురాగ్ భదౌరియా నిల్చున్నారు.
లఖ్నవూ జిల్లా సరోజినీ నగర్ స్థానం నుంచి భాజపా తరపున ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాజీ అధికారి రాజేశ్వర్ సింగ్ రంగంలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా ఎస్పీకి చెందిన మాజీ మంత్రి అభిషేక్ మిశ్రా పోటీలో ఉన్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నితిన్ అగర్వాల్ కూడా ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్కు కంచుకోటగా ఉన్న రాయ్బరేలీ కూడా ఇదే విడతలో పోలింగ్ జరుగనుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి గెలుపొందిన అదితి సింగ్ ఇటీవలే భాజపాలో చేరారు. ఈ ఎన్నికల్లో ఆమె రాయ్బరేలీ స్థానం నుంచే భాజపా తరపున పోటీ చేస్తున్నారు. 23వ తేదీ ఉదయం ఏడు గంటలకు పోలింగ్ మొదలై సాయంత్రం 6వరకు కొనసాగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన తుపాకీ.. సీఆర్పీఎఫ్ డీఎస్పీ మృతి
-
వారసత్వ ఆస్తుల్నీ వదలరట: పిట్రోడా వ్యాఖ్యలపై మోదీ విమర్శలు
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి