Uttarakhand: కొత్త సీఎంకు మ్యాప్ కష్టాలు!
ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టకముందే పుష్కర్ సింగ్ ధామీ వివాదంలో చిక్కుకున్నారు. ఆరేళ్ల క్రితం అఖండ్ భారత్ పేరిట ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా.....
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తరాఖండ్ సీఎంగా బాధ్యతలు చేపట్టకముందే పుష్కర్ సింగ్ ధామీ వివాదంలో చిక్కుకున్నారు. ఆరేళ్ల క్రితం అఖండ్ భారత్ పేరిట ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారింది. ఆ పటంలో ప్రస్తుత భారత భూభాగాలు లేకపోవడం వివాదానికి కారణమైంది. దీంతో ఆ ట్వీట్ను నెటిజన్లు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజులకే చిరిగిన జీన్స్పై కామెంట్స్ చేసి సీఎం తీరథ్ సింగ్ రావత్ వివాదంలో చిక్కుకోగా.. పుష్కర సింగ్ ధామీకి అర్ధ పుష్కర కాలం నాటి మ్యాప్ చిక్కులు తెచ్చిపెట్టిందన్నమాట!
2015లో స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అఖండ్ భారత్ కల సాకారం కావాలని పేర్కొంటూ ఈ మ్యాప్ను పుష్కర్సింగ్ అప్పట్లో ట్వీట్ చేశారు. ఆ మ్యాప్లో భరతమాత మధ్యలో ఉండగా... ఇరుగుపొరుగు దేశాలు అందులో ఉన్నాయి. అయితే భారత్లో అంతర్భాగంగా ఉన్న లద్దాఖ్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాలు లేకపోవడంతో నెటిజన్లు ఆ ట్వీట్ను వైరల్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. కొత్త సీఎంపై మండిపడుతున్నారు. మరికొందరు మాత్రం సమర్థిస్తున్నారు. ఏదైతేనేం మొత్తానికి నిన్న మొన్నటి వరకు పెద్దగా పరిచయం లేని పుష్కర్ సింగ్ ఈ మ్యాప్ ద్వారా నెటిజన్లకు బాగానే పరిచయం అయ్యారన్నమాట!!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?