అక్కడ వ్యాక్సినేషన్‌ తక్కువ.. పైగా ఫేక్‌ సెంటర్లు!

కరోనా వైరస్‌ నివారణకు చేపట్టిన వ్యాక్సినేషన్ పశ్చిమబెంగాల్‌లో తక్కువగా జరుగుతోందని, పైగా అక్కడ నకిలీ క్యాంపులు నిర్వహిస్తున్నారంటూ......

Published : 30 Jun 2021 01:03 IST

బెంగాల్‌లో వ్యాక్సినేషన్‌ తీరుపై నడ్డా విమర్శలు

కోల్‌కతా: కరోనా వైరస్‌ నివారణకు చేపట్టిన వ్యాక్సినేషన్ పశ్చిమబెంగాల్‌లో తక్కువగా జరుగుతోందని, పైగా అక్కడ నకిలీ క్యాంపులు నిర్వహిస్తున్నారంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. ఎన్నికల అనంతరం చెలరేగిన హింసాత్మక ఘటనలపై మండిపడ్డారు. ఓ మహిళ సీఎంగా ఉన్న చోట మహిళలపై వేధింపులు జరగడాన్ని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ఉచితంగా టీకాలు ఇస్తున్నప్పటికీ మమతా బెనర్జీ నేతృత్వంలోని బెంగాల్‌ ప్రభుత్వం పంపిణీలో విఫలమైందన్నారు.

దేశంలో  అతి తక్కువ వ్యాక్సినేషన్‌ పశ్చిమబెంగాల్‌లోనే జరుగుతున్నట్టు గణాంకాలు సూచిస్తున్నాయన్నారు. అలాగే, ఈ రాష్ట్రంలోనే నకిలీ వ్యాక్సినేషన్‌ క్యాంపులు నడుస్తున్నాయని ఆక్షేపించారు. ఎప్పుడూ తాము నకిలీ వ్యాక్సినేషన్‌ గురించి వినలేదని, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎంపీ మిమి చక్రవర్తికి కూడా నకిలీ వ్యాక్సినే వేశారన్నారు. బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి నిర్వహించిన పార్టీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశంలో ఆయన వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించారు. ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు చెలరేగడం పాలనాయంత్రాంగం వైఫల్యాన్ని ప్రతిబింబిస్తోందన్నారు. భాజపా కార్యకర్తల ఆధార్‌ కార్డులు, రేషన్‌ కార్డులను తీసేస్తున్నా పోలీసులు మౌనం వహిస్తున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని