Andhra News: బాధితురాలి వద్ద బలప్రదర్శన చేస్తారా?: వాసిరెడ్డి పద్మ
విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద నిన్నటి పరిణామాలపై తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ సీనియర్ నేత బొండా ఉమాలకు సమన్లు జారీ చేసినట్లు
విజయవాడ: విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద నిన్నటి పరిణామాలపై తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ సీనియర్ నేత బొండా ఉమాలకు సమన్లు జారీ చేసినట్లు ఏపీ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. సమన్లు జారీకి కారణాలు చెప్పాల్సిన బాధ్యత కమిషన్పై ఉందని తెలిపారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. మహిళల కన్నీళ్లు తుడవడానికే మహిళా కమిషన్ ఉందని వివరించారు. అత్యాచారం ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని వాసిరెడ్డి పద్మ చెప్పారు. బాధితురాలి వద్ద బల ప్రదర్శన చేస్తారా అని ప్రశ్నించారు. 24 గంటల్లో బాధ్యులను అరెస్టు చేస్తున్నామన్నారు. వారం రోజుల్లో ఛార్జిషీట్ పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు ఆమె చెప్పారు.
విజయవాడలోని ఆస్పత్రిలో అత్యాచార బాధితురాలిని పరామర్శించేందుకు వెళ్లినప్పుడు తనను అభ్యంతరకర పదజాలంతో దూషించారంటూ చంద్రబాబు, బొండా ఉమామహేశ్వరరావులకు వాసిరెడ్డి పద్మ నోటీసులు జారీ చేశారు. ఈ నెల 27న ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని కార్యాలయంలో జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై ఛీటింగ్ కేసు
-
యూట్యూబ్కు పోటీగా.. వీడియోల కోసం ‘ఎక్స్’ టీవీ యాప్!
-
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
-
ఆ ఇద్దరికి నో ప్లేస్.. వన్డౌన్ బ్యాటర్గా అతడే: ఇర్ఫాన్ పఠాన్
-
సంపద పంచుతారంటూ మోదీ ఆరోపణలు.. రాహుల్ క్లారిటీ
-
ప్రమాదవశాత్తు పేలిన ఏకే 47.. సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ మృతి