పోలింగ్‌ ముగిసే వరకు హైదరాబాద్‌లో తనిఖీలు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు గ్రేటర్‌లో పలు చర్యలు చేపడుతున్నారు. మద్యం, డబ్బు పంపిణీపై నిఘా పెట్టారు. ప్రధానంగా   జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.

Published : 25 Nov 2020 10:54 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు గ్రేటర్‌లో పలు చర్యలు చేపడుతున్నారు. మద్యం, డబ్బు పంపిణీపై నిఘా పెట్టారు. ప్రధానంగా   జంటనగరాల్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. కార్లు, జీపులు తదితర వాహనాలను ప్రధాన కూడళ్లలో నిలిపివేసి సోదాలు చేస్తున్నారు. అనుమానం వస్తే వాహనదారులను ప్రశ్నిస్తున్నారు. పోలింగ్‌ ముగిసే వరకు సోదాలు కొనసాగుతాయని అధికారులు వెల్లడించారు. డిసెంబరు 1న జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని