అసెంబ్లీ పోరు.. నామినేషన్ల జోరు

అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో ప్రచారాల హోరు.. నామినేషన్ల జోరుతో సందడి నెలకొంది. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సోమవారం నామినేషన్‌ వేశారు. కన్నూర్‌ జిల్లాలోని

Updated : 15 Mar 2021 14:45 IST

చెన్నై/తిరువనంతపురం: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతంలో ప్రచారాల హోరు.. నామినేషన్ల జోరుతో సందడి నెలకొంది. కేరళలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ సోమవారం నామినేషన్‌ దాఖలు చేశారు. కన్నూర్‌ జిల్లాలోని ధర్మదాం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఆయన.. నేడు తన నామపత్రాలు సమర్పించారు. కొవిడ్‌ నేపథ్యంలో ముఖానికి ఫేస్‌షీల్డ్‌, మాస్క్‌, గ్లౌజులు ధరించి వచ్చారు. ధర్మదాం నుంచి విజయన్‌ పోటీ చేస్తుండటం ఇది రెండోసారి. అంతకుముందు పయ్యన్నూర్‌ నుంచి నాలుగు సార్లు విజయం సాధించారు. 

పళని.. కాలినడకన వెళ్లి

మరో రాష్ట్రం తమిళనాడులోనూ నామినేషన్ల పర్వం జోరందుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి తన సొంత నియోజకవర్గం ఎడప్పాడి నుంచి నేడు నామినేషన్ వేశారు. తన ఇంటికి సమీపంలోని స్థానిక తాలూకా కార్యాలయానికి కాలినడకన వెళ్లిన ఆయన నామపత్రాలు సమర్పించారు. ఎడప్పాడి నుంచి పళని.. 1989, 1991, 2011, 2016 ఎన్నికల్లో నాలుగు సార్లు విజయం సాధించారు.  

స్టాలిన్‌.. రోడ్‌షో

ఇక డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ కూడా సోమవారమే నామినేషన్‌ వేశారు. వరుసగా మూడోసారి ఆయన కొలతూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. నామపత్రాల సమర్పణ అనంతరం స్టాలిన్‌ భారీ రోడ్‌ షో నిర్వహించారు. తమిళనాడు, కేరళలో ఏప్రిల్‌ 6న ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వీటితో పాటు పశ్చిమ బెంగాల్‌, అసోం, పుదుచ్చేరిలోనూ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని