AP News: వైకాపాను గద్దె దించితే తెదేపాను భాజపాలో కలుపుతామన్నారు: విజయసాయి
తన స్వలాభం కోసమే తెదేపా అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని మోసం చేశారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఉత్తరాంధ్రలో మాదకద్రవ్యాలకు
విశాఖ: తన స్వలాభం కోసమే తెదేపా అధినేత చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీని మోసం చేశారని వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. ఉత్తరాంధ్రలో మాదకద్రవ్యాలకు పురుడు పోసింది తెదేపా నేతలేనన్నారు. రూ.500 కోట్ల గంజాయి అక్రమ జరిగిందన్నారు. శుక్రవారం ఆయన విశాఖలో జరిగిన వైకాపా జనాగ్రహ దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, లోకేశ్లపై మండిపడ్డారు. రాష్ట్రంలో నమ్మడంలేదనే చంద్రబాబు దిల్లీ వెళ్తున్నారన్నారు. నర్సీపట్నం ప్రజలు వద్దని చెప్పినా మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి బుద్ధిరాలేదని వ్యాఖ్యానించారు. భాజపా పెద్దలకు చంద్రబాబు ప్రతిపాదనలు పంపారనీ.. వైకాపా సర్కారును గద్దె దించితే తెదేపాను భాజపాలో కలుపుతామన్నారంటూ విజయసాయిరెడ్డి ఆరోపించారు.
జగన్ను పదవి నుంచి దించాలని చంద్రబాబు ప్రయత్నం: సజ్జల
మరోవైపు, గుంటూరులో జరిగిన జనాగ్రహ దీక్షలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. తెదేపా కార్యాలయం దేవాలయమని చంద్రబాబు అన్నారు.. మరి దేవాలయంలో బూతులు ఎలా మాట్లాడనిచ్చారు? అంటూ సజ్జల ప్రశ్నించారు. బూతులపై చంద్రబాబు ఉద్యమం నిర్మిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించేందుకు.. జగన్ను పదవి నుంచి దింపాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
స్టాయినిస్ శతకం.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
డిన్నరేనా.. డ్యాన్స్ వద్దా?: షారుక్ఖాన్తో మోహన్లాల్
-
ఇండిగో విమానాల్లో ఇక వినోదం.. తొలుత ఈ రూట్లోనే..
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్