AP News: మరో 20ఏళ్ల పాటు మంచి పరిపాలన అందిస్తాం: విజయసాయిరెడ్డి

మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు 2024లో వైకాపా విజయానికి చిహ్నమని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం

Published : 18 Nov 2021 01:44 IST

విశాఖ: మున్సిపల్‌ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు 2024లో వైకాపా విజయానికి చిహ్నమని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో వైకాపా ఘన విజయం తర్వాత విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ పతనం మొదలైందన్నారు. చంద్రబాబు రాజకీయ ప్రస్థానానికి తెరపడిందని, భవిష్యత్‌లో ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా అనర్హుడని విమర్శించారు. 2019లో చంద్రబాబు పాలనలో ఆయన కుమారుడు ఓటమిపాలయ్యారని గుర్తు చేశారు. సొంత నియోజకవర్గంలోనే ఓడిపోయిన చంద్రబాబుకు దౌర్జన్యాలు, అక్రమాలని మాట్లాడే అర్హత లేదని వ్యాఖ్యానించారు. భవిష్యత్‌లో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే అర్హత కూడా లేదని విమర్శించారు. జగన్‌ సుపరిపాలనను ప్రజలు అర్థంచేసుకున్నారని, మరో 20 ఏళ్ల పాటు మంచి పాలన అందిస్తామని విజయసాయిరెడ్డి చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని