Munugode bypoll: కేసీఆర్ బీబీసీ తీసుకుని మోసపోవద్దు: విజయశాంతి
ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చే బీబీసీ (బిర్యానీ, బ్రాందీ, కరెన్సీ) తీసుకుని మోస పోవద్దని మాజీ ఎంపీ విజయశాంతి మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి భాజపాలో
హైదరాబాద్: ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చే బీబీసీ (బిర్యానీ, బ్రాందీ, కరెన్సీ) తీసుకుని మోస పోవద్దని మాజీ ఎంపీ విజయశాంతి మునుగోడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి భాజపాలో చేరిక సందర్బంగా మునుగోడులో ఏర్పాటు చేసిన సమరభేరి సభలో విజయశాంతి పాల్గొని ప్రసంగించారు. ‘‘కేసీఆర్ ఎనిమిదేళ్లలో ఏం చేశావ్. ఉద్యమం చేస్తానని తెలంగాణలో ప్రవేశించావు. నాకుటుంబంలో ఎవరూ రాజకీయాల్లో లేరు.. నేనొక్కడినే. తెలంగాణకోసం కొట్లాడతానని ప్రజలను నమ్మించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చారు కుటుంబాన్ని తీసుకొచ్చారు. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానన్నారు.. చేయలేదు. తాను ముఖ్యమంత్రిగా కూర్చుని.. తెలంగాణ కోసం కొట్లాడిన అమరవీరులను తుంగలోకి తొక్కారు. ఇందుకోసం మిమ్మల్ని సమర్థించాలా? దళితుడికి 3 ఎకరాల భూమి ఇస్తామన్నారు.. ఇవ్వలేదు. ప్రతి పేద కుటుంబానికి డబుల్బెడ్ రూమ్ ఇల్లు ఇస్తానన్నారు .. ఇవ్వకుండా మోసం చేశారు. ఇందుకోసం సమర్థించాలా? కాళేశ్వరం ప్రాజెక్టు నేనే డిజైన్ చేశాను, నేనే కడుతున్నానని.. వేల కోట్లు అప్పులు తీసుకున్నారు. కానీ, ఆడబ్బంతా జేబులో వేసుకున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు కనీస వసతులు కల్పించాలని ఉద్యమం చేస్తే వారిని కూడా మోసం చేశారు. గురుకులాల్లో పురుగుల అన్నం పెడుతున్నారు.. దీనికోసం మిమ్మల్ని సమర్థించాలా? కేసీఆర్కు భయం పట్టుకుంది. ఫ్రస్టేషన్లో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు.
మోదీ ఆయనకు శత్రువట.. నిజమే. కానీ, మోదీ ప్రజలకు మాత్రం మంచి మిత్రుడు. ఐటీ, సీబీఐ, ఈడీ వచ్చినా భయం లేదంటున్నారు. ప్రతీ వేదికపై ఇదే చెబుతున్నారు. భయం లేనప్పుడు పదే పదే.. సీబీఐ వస్తే భయంలేదు, ఈడీ వస్తే భయంలేదని ఎందుకు చెబుతున్నారు. లోలోపల మీరు భయపడుతున్నారు కాబట్టే చెబుతున్నారు. ప్రతి ఎన్నికల్లో కేసీఆర్ చెప్పే మాయ మాటలకు ప్రజలు మోస పోయి గెలిపిస్తున్నారు. నిన్నటి వరకు ప్రత్యా్మ్నాయ పార్టీ లేదు. అందుకే కేసీఆర్ను గెలిపించారు... ఆయన చేసిన అవినీతిని భరించారు. కానీ, ఇవాళ భాజపా ప్రత్యామ్నాయంగా వచ్చేసింది. భాజపాను అధికారంలోకి తీసుకొచ్చి మేలు జరిగే విధంగా చేసుకోండి. కేసీఆర్ ప్రతి ఎన్నికల్లో బీబీసీ (బిర్యానీ, బ్రాందీ, కరెన్సీ) తీసుకొస్తారు. బీబీసీ ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు. దయచేసి మోసపోవద్దు. నిన్నటి సభకు రూ.వెయ్యి, మద్యం బాటిల్ ఇచ్చి జనాలను తరలించారు. రోజు రోజుకీ కేసీఆర్ గ్రాఫ్ పడిపోతోంది. మైండ్ గేమ్ ఆడుతూ భాజపాలోని నాయకులను విడదీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఎన్ని మైండ్గేమ్లు ఆడినా భాజపా నేతలను విడదీయలేరు. కేసీఆర్ను గద్దె దించడమే మా అందరి ఏకైక లక్ష్యం’’ అని విజయశాంతి స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
తెదేపా అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. -
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పలువురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. -
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
మాజీ మంత్రి వివేకా హత్య కేసుపై వ్యాఖ్యలు చేయొద్దని కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఆయన కుమార్తె సునీత స్పందించారు. -
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు
తెదేపా (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నేడు కుప్పంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. -
భారాసకు మరో ఎమ్మెల్యే గుడ్బై!
మరో ఎమ్మెల్యే భారాసను వీడనున్నారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ శుక్రవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు. -
అన్నదాతల ఆత్మహత్యలన్నీ జగన్ ప్రభుత్వం చేసిన హత్యలే: ప్రత్తిపాటి పుల్లారావు
జగన్ పాలనలో రైతుల జీవితాలు గాలిలో దీపంగా మారాయని తెదేపా నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విమర్శించారు. -
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
కపటనీతికి మారుపేరు కాంగ్రెస్ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా విమర్శించారు. -
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
Lok sabha Elections: లోక్సభ ఎన్నికల తొలివిడత పోలింగ్లో దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు ఓటేస్తున్నారు. దేశవాసులు ఈ ప్రజాస్వామ్య పండగలో భాగం కావాలని పిలుపునిస్తున్నారు. -
భాజపా వైపు పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్ నేత చూపు?
పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత భాజపాలో చేరే అవకాశాలున్నట్లు తెలిసింది. -
‘కృష్ణుడి గోపికను నేనే’: హేమామాలిని
సీనియర్ నటి, భాజపా మథుర నియోజకవర్గ ఎంపీ అభ్యర్థి హేమామాలిని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శ్రీకృష్ణుడికి గోపికగా తనను తాను భావించుకుంటానని తెలిపారు. -
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
Lok Sabha polls: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఓటర్లు తమ హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. -
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
రాజకీయ నాయకులే కాదు.. అఖిల భారత సర్వీసుల్లో ఉన్నత స్థాయిలో పనిచేసిన పలువురు అధికారులూ ప్రజాసేవ కోసం ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల కదన రంగంలోకి దిగారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
చీపురుపల్లిలో మంత్రి బొత్సకు భారీ షాక్
వైకాపా కీలకనేత, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఆయనకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
సార్వత్రిక సమరం.. ప్రారంభమైన తొలి దశ పోలింగ్
Loksabha Elections: మొత్తం 102 స్థానాలకు ఈరోజు పోలింగ్ జరుగుతోంది. దేశవ్యాప్తంగా 16.63 కోట్ల మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేందుకు సిద్ధమయ్యారు. -
ఈసీ నిబంధనలకు విరుద్ధంగా వైకాపా సోషల్ మీడియా తీరు
సీఎం జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అధికార పార్టీ సోషల్ మీడియా విభాగం ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం చేస్తోంది. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైంది. 22 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా వివిధ నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. -
భీమిలిలో వైకాపా ఖాళీ!
ప్రకృతి అందాలకు నెలవైన తీరప్రాంత నియోజకవర్గం భీమిలి. ముఖ్యమంత్రి జగన్.. రాజధానిని విశాఖకు మార్చేసి నివాసం ఉండాలని కలలుగన్న ప్రాతం. -
మద్యం అమ్మేది జగనే
2019 ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీనీ సీఎం జగన్ నెరవేర్చలేదని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. -
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి భార్య
నామినేషన్ల ఘట్టం మొదలైన తొలి రోజే శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామం వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య