Andhra News: 3 రాజధానులకు మద్దతుగా ‘విశాఖ గర్జన’
విశాఖలో రాజధాని కావాలని ‘విశాఖ గర్జన’ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు తమ ఆకాంక్షను వెలిబుచ్చారని మంత్రులు, వైకాపా నేతలు అన్నారు.
విశాఖపట్నం: విశాఖలో రాజధాని కావాలని ‘విశాఖ గర్జన’ ద్వారా ఉత్తరాంధ్ర ప్రజలు తమ ఆకాంక్షను వెలిబుచ్చారని మంత్రులు, వైకాపా నేతలు అన్నారు. అమరావతితో పాటుగా విశాఖ, కర్నూలును రాజధానులుగా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంకల్పానికి ఈ గర్జన ద్వారా ప్రజలు తమ సంపూర్ణ మద్దతు తెలిపారని చెప్పారు. అధికార వికేంద్రీకరణకు 3 రాజధానుల సూత్రం బాగా పనిచేస్తుందన్న నేతలు.. దీనికోసం భవిష్యత్తులో ప్రజలు నినదించేలా కార్యక్రమాలకు తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. ర్యాలీ పూర్తయిన తర్వాత పార్క్ హోటల్ జంక్షన్లో వైఎస్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు ధర్మాన ప్రసాదరావు, రోజా, కొట్టు సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమర్నాథ్, జోగి రమేష్, వైకాపా ప్రాంతీయ సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని తదితరులు పాల్గొన్నారు.
వర్షం కారణంగా ర్యాలీకి ఆటంకం..
3 రాజధానులకు మద్దతుగా జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీకి వర్షం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. పెద్ద ఎత్తున తరలివచ్చిన అధికార పార్టీ కార్యకర్తలు, విద్యార్థులు, మహిళలు వర్షంలోనే ర్యాలీలో పాల్గొన్నారు. జోన్ల వారీగా బస్సులు ఏర్పాటు చేయడంతో ర్యాలీలో జనసందోహం కనిపించింది. ఎల్ఐసీ జంక్షన్ నుంచి సెవెన్హిల్స్ మార్గం మీదుగా సిరిపురం, ఆంధ్ర విశ్వవిద్యాలయం, చిన వాల్తేరు నుంచి పార్క్ హోటల్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. వైకాపా యంత్రాంగం పెద్ద ఎత్తున జనసమీకరణపై దృష్టి పెట్టింది. మహిళా గ్రూపు సభ్యులు, విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులను పెద్ద ఎత్తున సమీకరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
క్షమాపణలు యాడ్ సైజ్లోనే ప్రచురించారా? పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!