‘రాబోయే ఎన్నికల్లో భాజపాతోనే కలిసి నడుస్తాం’
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో భాజపాతో తమ పొత్తు కొనసాగుతుందని కేంద్ర మంత్రి, ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ)’ అధినేత రామ్దాస్ అఠవాలే తెలిపారు.
ఆర్పీఐ అధినేత రామ్దాస్ అఠవాలే
లఖ్నవూ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో భాజపాతో కలిసి నడుస్తామని కేంద్ర మంత్రి, ‘రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (ఆర్పీఐ)’ అధినేత రామ్దాస్ అఠవాలే తెలిపారు. అలాగే ఉత్తర్ప్రదేశ్లో 2022లో జరిగే శాసనసభ ఎన్నికల్లోనూ భాజపాతోనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ విషయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి చర్చిస్తామని తెలిపారు. ఉత్తర్ప్రదేశ్లో ఆర్పీఐకి 8-10 సీట్లు ఇవ్వగలిగితే.. ఆ రాష్ట్రంలో ప్రధాన పార్టీల్లో ఒకటైన బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ)ని దీటుగా ఎదుర్కొంటామని ధీమా వ్యక్తం చేశారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి నాయకత్వంపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని.. వారంతా ఆర్పీఐ వైపు చూస్తున్నారని తెలిపారు.
ఇక ఇతర రాష్ట్రాల్లో పరిస్థితిపై ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, భాజపా జాతీయాధ్యక్షుడు జె.పి.నడ్డాతో కలిసి మాట్లాడతామని అఠవాలే తెలిపారు. ఒకవేళ భాజపా ఆర్పీఐకి సీట్లు ఇవ్వడానికి నిరాకరిస్తే.. కొన్ని స్థానాల్లో సొంతంగా తమ అభ్యర్థులను బరిలోకి దింపుతామని తెలిపారు. మిగిలిన స్థానాల్లో భాజపాకు మద్దతు ప్రకటిస్తామని తెలిపారు. పశ్చిమ బెంగాల్ జనాభాలో 36 శాతం దళితులేనని.. ఆర్పీఐ ఎన్నికల్లో పోటీ చేయడం వల్ల భాజపాకే కలిసొస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ సందర్భంగా భీం ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్, బీఎస్పీ అధినేత్రి మాయావతిని అఠవాలే తమ పార్టీలోకి రావాలని ఆహ్వానించడం గమనార్హం. ఆజాద్ ఆర్పీఐలో చేరితే కీలక స్థానం ఇస్తామని తెలిపారు. అలాగే మాయావతి పార్టీలోకి వస్తే తన చేతిలో ఉన్న అధ్యక్ష బాధ్యతలు ఆమెకు అప్పగించి తాను ఉపాధ్యక్షునిగా ఉండిపోతానని చెప్పారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారని అఠవాలే అభిప్రాయపడ్డారు. ఆ రాష్ట్రంలో భాజపా 200కు పైగా సీట్లలో విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేరళ సహా ఎన్నికలు జరగనున్న అన్ని రాష్ట్రాల్లో భాజపా విజయం సాధిస్తుందని తెలిపారు. ఇక ఈ సందర్భంగా కాంగ్రెస్పైనా అఠవాలే విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ఉన్నంత కాలం ఆ పార్టీకి భవిష్యత్తు లేదంటూ ఎద్దేవా చేశారు.
ఇక రైతుల ఆందోళనపై మాట్లాడిన అఠవాలే.. సాగు చట్టాల్లో సవరణలకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. చట్టాల రద్దు మాత్రం కుదరదని తెలిపారు. ఉత్తర్ప్రదేశ్లో భూమిలేని వారికి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఐదు ఎకరాల పొలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే మహారాష్ట్రలో మరాఠాలు, హరియాణాలో జాట్లు, ఉత్తర్ప్రదేశ్లో రాజ్పూత్లకు రిజర్వేషన్లలో 10-12 శాతం కోటా కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇక 2021 జనాభా లెక్కల్లో కుల సంబంధిత వివరాలను నమోదు చేయాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM