AAP: మేం రెడీ.. ‘హిమాచల్’ ఓటర్ల తీర్పు మా వైపే..: ఆప్
హిమాచల్ప్రదేశ్(Himachal Pradesh) ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం(CEC) ప్రకటించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) స్పందించింది.
దిల్లీ: హిమాచల్ప్రదేశ్(Himachal Pradesh) ఎన్నికల షెడ్యూల్ని కేంద్ర ఎన్నికల సంఘం(CEC) ప్రకటించడంపై ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) స్పందించింది. ఎన్నికలకు తాము సిద్ధంగానే ఉన్నామని.. ప్రజా తీర్పు తమవైపే ఉంటుందన్న పూర్తి విశ్వాసంతో ఉన్నామని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు, ఎమ్మెల్యే దుర్గేశ్ పాఠక్ అన్నారు. ప్రతి గ్రామంలో బృందాలు ఏర్పాటు చేశామని.. ప్రజలకు తమ పార్టీ సందేశాన్ని చేర్చేందుకు కష్టపడి పనిచేస్తున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్, భాజపా పాలనలో రాష్ట్రాన్ని దోచుకున్న తీరు, దిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం చేస్తున్న పనిని చూసి హిమాచల్ప్రదేశ్ ప్రజలు ఈసారి కచ్చితంగా ఆప్కి అవకాశం ఇస్తారని పూర్తి విశ్వాసం ఉందన్నారు. ఇటీవల పంజాబ్లో ఏర్పాటైన భగవంత్ మాన్ సారథ్యంలోని ఆప్ ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తోందని దుర్గేశ్ చెప్పారు.
మరోవైపు, ఇప్పటివరకు హిమాచల్ప్రదేశ్ రాజకీయాల్లో ద్విముఖ పోరే ఉండేది. అధికార పీఠం కోసం కాంగ్రెస్, భాజపాలే ప్రధానంగా పోటీ పడుతుండేవి. కానీ ఈసారి ఆమ్ ఆద్మీ పార్టీ రంగంలోకి దిగింది. దీంతో ఈసారి ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంది. పంజాబ్లో విజయోత్సాహంతో హిమాచల్ప్రదేశ్ ఎన్నికల కదనరంగంలోకి దూకుతోన్న ఆప్ గెలుపుకోసం అహర్నిశలూ శ్రమిస్తోంది. అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్టు ఇప్పటికే ఆప్ ప్రకటించింది. హిమాచల్ ప్రదేశ్లో నవంబర్ 12న ఎన్నికలు జరగనుండగా.. డిసెంబర్ 8న ఫలితాలు వెల్లడించనున్నట్టు ఈసీ తెలిపిన విషయం తెలిసిందే. హిమాచల్ అసెంబ్లీలో మొత్తం 68 సీట్లు ఉండగా.. 2017లో జరిగిన ఎన్నికల్లో భాజపా 44 సీట్లు గెలుచుకోగా.. కాంగ్రెస్ 21 చోట్ల విజయం సాధించింది. అలాగే, స్వతంత్రులు రెండు, సీపీఎం ఒకచోట విజయం సాధించాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..
-
వన్ప్లస్ నార్డ్ సీఈ3 ఫోన్పై డిస్కౌంట్.. ఈ సబ్స్క్రిప్షన్లూ ఉచితం!
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి