బెంగాల్‌లో కొనసాగుతున్న 4వ దశ పోలింగ్‌

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి నాలుగో దశ ఎన్నికల పోలింగ్‌ శనివారం ప్రారంభమైంది. ఈ దశలో భాగంగా మొత్తం 44 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది.

Updated : 10 Apr 2021 11:02 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి నాలుగో దశ ఎన్నికల పోలింగ్‌ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ దశలో భాగంగా మొత్తం 44 నియోజకవర్గాల్లో పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 1.15కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ రోజు జరుగుతున్న పోలింగ్‌లో అన్ని స్థానాల్లో కలిపి మొత్తం 373 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఇందుకోసం మొత్తం 15,940 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 80వేల మంది కేంద్ర భద్రతా సిబ్బందిని మోహరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. 

ఈ దశలో కేంద్ర మంత్రి బాబుల్‌ సుప్రియో టోలీగంజ్‌ నుంచి బరిలో ఉన్నారు. మరోవైపు బెహెలా నియోజకవర్గం నుంచి టీఎంసీ కీలక నేత, మంత్రి పార్థ ఛటర్జీపై భాజపా తరపున  సినీ నటి పాయల్‌ సర్కార్‌ పోటీ చేస్తున్నారు. కాగా, గత 2016 ఎన్నికల్లో ఈ 44 స్థానాల్లో అధికార టీఎంసీ కేవలం 5  మినహా అన్ని స్థానాల్లో విజయం సాధించింది. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని