బెంగాల్లో కొనసాగుతున్న 4వ దశ పోలింగ్
పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి నాలుగో దశ ఎన్నికల పోలింగ్ శనివారం ప్రారంభమైంది. ఈ దశలో భాగంగా మొత్తం 44 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది.
కోల్కతా: పశ్చిమబెంగాల్ అసెంబ్లీకి నాలుగో దశ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. ఈ దశలో భాగంగా మొత్తం 44 నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 1.15కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఈ రోజు జరుగుతున్న పోలింగ్లో అన్ని స్థానాల్లో కలిపి మొత్తం 373 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. ఇందుకోసం మొత్తం 15,940 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దాదాపు 80వేల మంది కేంద్ర భద్రతా సిబ్బందిని మోహరించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
ఈ దశలో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో టోలీగంజ్ నుంచి బరిలో ఉన్నారు. మరోవైపు బెహెలా నియోజకవర్గం నుంచి టీఎంసీ కీలక నేత, మంత్రి పార్థ ఛటర్జీపై భాజపా తరపున సినీ నటి పాయల్ సర్కార్ పోటీ చేస్తున్నారు. కాగా, గత 2016 ఎన్నికల్లో ఈ 44 స్థానాల్లో అధికార టీఎంసీ కేవలం 5 మినహా అన్ని స్థానాల్లో విజయం సాధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!