బెంగాల్ పోరు: ఏడో దశలోనూ అదే జోరు!
పశ్చిమ బెంగాల్లో నేడు ఏడో విడతలో భాగంగా 34 శాసనసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 75శాతం పోలింగ్ నమోదయ్యింది.
ఓటు హక్కు వినియోగించుకున్న మమతా బెనర్జీ
కోల్కతా: ఓవైపు కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్నప్పటికీ పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అదే జోరు కొనసాగింది. ఓవైపు ఎండ తీవ్రత, మరోవైపు కొవిడ్ ఉద్ధృతి నడుమ బెంగాల్లో ఏడో విడత పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఈ విడతలో 34 శాసనసభ స్థానాలకు జరగ్గా.. సాయంత్రం వరకు 75శాతం పోలింగ్ నమోదైంది.
పశ్చిమ బెంగాల్లో 294 అసెంబ్లీ స్థానాలకుగానూ మొత్తం ఎనిమిది విడతల్లో పోలింగ్ జరుగుతోంది. నేడు (ఏప్రిల్ 26) జరిగిన ఏడో విడతలో భాగంగా ఐదు జిల్లాల పరిధిలో ఉన్న 34 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ పూర్తయ్యింది. సాయంత్రం 7గంటల వరకు అక్కడ 75.06శాతం పోలింగ్ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాణినగర్ నియోజక వర్గంలో అత్యధికంగా 84శాతం పోలింగ్ నమోదుకాగా, ముర్షీదాబాద్, భాగబంగోలా స్థానాల్లో 83శాతం పోలింగ్ రికార్డయ్యింది. కొవిడ్ ఉద్ధృతి నేపథ్యంలో ఓటర్లు వైరస్ బారిన పడకుండా ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక కొవిడ్ సోకిన వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు పోలింగ్ చివరి గంట వారికి కేటాయించారు. దీంతో పలు కేంద్రాల్లో పీపీఈ కిట్లతో వచ్చిన రోగులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ దశలో మొత్తం 284 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు.
ఓటు వేసిన మమతా బెనర్జీ..
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేడు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కోల్కతాలోని భవానీపోర్లో ఉన్న పోలింగ్ బూత్లో మమతా బెనర్జీ ఓటు వేశారు. ఓటు వేసిన తర్వాత విజయ సంకేతాన్ని చూపుకుంటూ బయటకు వచ్చారు. గత ఎన్నికల్లో భవానీపోర్ నుంచి పోటీ చేసిన మమతా బెనర్జీ, ఈసారి నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగిన విషయం తెలిసిందే.
ఇదిలాఉంటే, ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్లో ఏడు విడతల్లో మొత్తం 259 స్థానాల్లో పోలింగ్ పూర్తయ్యింది. ఇక ఏప్రిల్ 29న జరిగే చివరి విడతలో 35 స్థానాలకు పోలింగ్ జరుగనుంది. మే 2 వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
రెజ్యూమె రూపొందించడంలో ఈ తప్పులొద్దు.. గూగుల్ మాజీ రిక్రూటర్ టిప్స్
-
కోటక్ బ్యాంక్కు ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డుల జారీ, కొత్త కస్టమర్ల చేరికపై ఆంక్షలు
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్