Chandrababu: తెదేపా అన్స్టాపబుల్.. అడ్డొస్తే తొక్కుకొని వెళ్తాం: చంద్రబాబు
రానున్న నవంబర్, డిసెంబర్ నెలల్లో ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశముందని తెదేపా అధినేత చంద్రబాబు అభిప్రాయపడ్డారు. తెదేపా అన్స్టాపబుల్ అని, అడ్డొస్తే తొక్కుకొని వెళ్తామని అన్నారు.
అమరావతి: వైకాపా ఎమ్మెల్యేలకు జగన్పై నమ్మకం లేదని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ఇక నుంచి తెలుగుదేశం పార్టీ.. అన్స్టాపబుల్ అని, గేర్ మార్చి.. స్పీడ్ పెంచుతామని తెలిపారు. ‘సైకిల్పై దూసుకెళ్తాం.. అడ్డొస్తే తొక్కుకొని వెళ్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు. సీఎం చేసిన విధ్వంసం వల్ల ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందన్న చంద్రబాబు.. అప్పులు చేయడం, దోచుకోవడమే జగన్ పని అని దుయ్యబట్టారు. చాలా మంది వైకాపా ఎమ్మెల్యేల్లో గుసగుసలు మొదలయ్యాయని చెప్పారు. ఇకపై వైకాపా పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలని, అధికార పార్టీ మరిన్ని ఇబ్బందులు పెట్టినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన తెదేపా జోన్-3 సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్ది ధన బలమైతే.. తెదేపాది జనబలమని అన్నారు. పేదలను దోచుకున్న జగన్.. పేదల ప్రతినిధిగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. దేశంలో అందరి ముఖ్యమంత్రులకున్న ఆస్తి కంటే జగన్ ఆస్తి ఎక్కువని చంద్రబాబు ఆరోపించారు. పట్టభద్రుల్లో తిరుగుబాటు వచ్చిందని, దాని ఫలితమే ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలనీ అన్నారు.
కార్యకర్తలకు సమయం ఇవ్వలేకపోయా
వచ్చే ఎన్నికల్లో తెదేపా అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు స్పష్టం చేశారు. కష్టపడ్డ కార్యకర్తలను వెతుక్కుంటూ పార్టీనే వాళ్ల వద్దకు వస్తుందని, వచ్చే ప్రభుత్వంలో పైరవీలు ఉండవని తేల్చి చెప్పారు. పార్టీ కోసం పనిచేసే వారే తన ఆప్తులని, వారికే ప్రాధాన్యత ఇస్తానని చంద్రబాబు వెల్లడించారు. రాష్ట్రాన్ని బాగుచేయడం ఎంత ముఖ్యమో, తెలుగుదేశం కుటుంబ సభ్యులను బాగుచేయడం అంతే ముఖ్యమని ఉద్ఘాటించారు. గతంలో తాను కార్యకర్తలకు ఎక్కువ సమయం ఇవ్వలేకపోయిన మాట వాస్తవమేనన్న చంద్రబాబు.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలి, అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉండిపోయానన్నారు. ఈసారి కార్యకర్తలకే పెద్దపీట వేస్తామని, ఎన్ని పనులున్నా కార్యకర్తలే ముఖ్యమని చెప్పారు.
క్లీన్ స్వీప్ ఖాయం
తెదేపా బలపడింది కాబట్టి... జగన్ నవంబరులోనో, డిసెంబరులోనూ ఎన్నికలకు వెళ్లొచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లినా దాన్ని ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవాలని కార్యకర్తలకు ఆయన సూచించారు. అధికారంలోకి వచ్చాక సమస్యల పరిష్కారానికి ప్రత్యేక మంత్రిని నియమిస్తామని చెప్పారు. గ్రామ స్థాయిలో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంతలో పశువుల మాదిరిగా తెలుగుదేశం ఎమ్మెల్యేలను వైకాపా కొనుగోలు చేసిందని మండిపడ్డారు. ఈ ఏడాది మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. ఒక్కసారి అంటూ అధికారంలోకి వచ్చిన జగన్కు ఇదే చివరిసారి కావాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పార్టీ నిర్ణయం శిరోధార్యం: దేవినేని ఉమా
పార్టీ తీసుకున్న నిర్ణయం శిరోధార్యమని, చంద్రబాబును తిరిగి ముఖ్యమంత్రిగా చేసేందుకు పనిచేస్తానని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
రేపు నామినేషన్ వేయనున్న పవన్కల్యాణ్
జనసేన అధినేత పవన్కల్యాణ్ ఈ నెల 23 (మంగళవారం)న నామినేషన్ దాఖలు చేయనున్నారని ఆ పార్టీ నియోజకవర్గ ఎన్నికల కమిటీ సమన్వయకర్త మర్రెడ్డి శ్రీనివాస్ తెలిపారు. -
వివేకా హత్య కేసుపై మాట్లాడొద్దంటే ఎలా?
ప్రజాస్వామ్య దేశంలో ఉన్నది ఉన్నట్లు మాట్లాడకుండా న్యాయస్థానాలు రాజకీయ పార్టీలకు ఆంక్షలు విధించడం సరికాదని, దీన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. -
సొమ్ములిచ్చి.. జనాన్ని తెచ్చి!.. జగన్ బస్సు యాత్రకు నేతల ఆపసోపాలు
విశాఖలో ఆదివారం సీఎం జగన్ చేపట్టిన బస్సు యాత్ర తుస్సుమంది. డబ్బులు, బిర్యానీ ప్యాకెట్లు, మద్యం బాటిళ్లు పంచి మరీ కొన్ని కూడళ్ల వద్ద జనాలను నింపాల్సి వచ్చింది. -
ఏ ముఖం పెట్టుకొని ఉత్తరాంధ్రకు వస్తున్నారు?
‘విశాఖ స్టీల్ప్లాంట్కు చెందిన వేల ఎకరాలను అమ్మేయాలని చెప్పి, దాన్ని అంపశయ్య మీదకు చేర్చిన సీఎం జగన్.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని విశాఖకు వస్తున్నారు? నగరాన్ని గంజాయికి, డ్రగ్స్కు అడ్డాగా మార్చారు. -
శ్రీశైలం క్షేత్ర పరిధిలో.. ఎన్నికల ప్రచారంపై అధికారుల అభ్యంతరం
నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో వైకాపా ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి ఆదివారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. -
సొమ్ముతో ప్రచార సోకులు!
సీఎం జగన్ బస్సు యాత్ర కోసం ఆదివారం సాయంత్రం విశాఖలోని అక్కయ్యపాలెం 80 అడుగుల రహదారి వద్ద జనసమీకరణ చేశారు. -
బాబ్బాబు.. వైకాపా వీడొద్దయ్యా!
మేమంతా సిద్ధం అంటూ జగన్ బస్సు ఎక్కి భీమిలి వస్తుంటే.. ‘మేమంతా సిద్ధమే తెదేపాలోకి వెళ్లేందుకు’ అంటూ ఆనందపురం మండలం కుసులువాడ గ్రామస్థులు మూకుమ్మడిగా సైకిలెక్కారు. -
ఉద్యోగులను చూసి వణికిపోతున్న జగన్
ప్రభుత్వ ఉద్యోగుల పోస్టల్ బ్యాలట్ ఓట్లను తగ్గించేందుకు వైకాపా సర్కారు కుట్రలు చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ పర్చూరి అశోక్బాబు ఆరోపించారు. -
ఆర్జేడీలో చేరిన బిహార్లోని ఎన్డీయే ఏకైక ముస్లిం ఎంపీ
బిహార్కు చెందిన ఎల్జేపీ లోక్సభ సభ్యుడు మహబూబ్ అలీ కైసర్ ఆదివారం ఆర్జేడీలో చేరారు. ఆ రాష్ట్రంలో భాజపా నేతృత్వంలోని ఎన్డీయేకు చెందిన ఏకైక ముస్లిం పార్లమెంటు సభ్యుడు మహబూబ్ అలీ కావడం గమనార్హం. -
హెచ్సీయూలో ఏబీవీపీ దాడులపై విచారణ జరపాలి: తమ్మినేని
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో ఏబీవీపీ నాయకత్వంలో వారం రోజులుగా దాడులు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆందోళన వ్యక్తం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
డీప్ఫేక్ వీడియోపై రణ్వీర్ సింగ్ పోలీస్ కేసు
-
ఎంపీ అభ్యర్థి మాధవీలతతో ఏఎస్సై ఆలింగనం.. సస్పెండ్ చేసిన సీపీ
-
‘ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్’ వ్యవస్థ ధరనూ కుదించిన టెస్లా
-
కోర్సు ఎందుకు.. హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేయండి: సుప్రీం ఆగ్రహం
-
ఏఐకి డేటా కంటే విలువైనది ఇదే.. మార్క్ జుకర్బర్గ్ అంచనా!
-
కవితకు బెయిల్ ఇవ్వొద్దు: సీబీఐ