Congress: కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర: సోనియా గాంధీ ప్రకటన
దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో పాదయాత్ర చేపట్టనున్నట్లు........
ఉదయ్పూర్: కేంద్రంలోని భాజపా సారథ్యంలోని ఎన్డీయే సర్కారు లోపాలను ఓవైపు లేవనెత్తుతూనే.. తమ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపేలా కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇందుకు అనుగుణంగా దేశవ్యాప్తంగా పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించింది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ‘భారత్ జోడో యాత్ర’ పేరుతో కాంగ్రెస్ పాదయాత్ర చేపట్టనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ‘నవసంకల్ప చింతన శిబిరం’లో ముగింపు కార్యక్రమంలో సోనియా మాట్లాడారు. గాంధీ జయంతిని పురస్కరించుకొని వచ్చే అక్టోబర్ 2వ తేదీ నుంచి ఈ పాదయాత్ర కొనసాగుందని వెల్లడించారు. కాంగ్రెస్లోని సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అందరూ ఈ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేలా పలు ఛలోక్తులు విసిరారు సోనియా గాంధీ. సభకు సీనియర్ నేతలంతా హాజరుకావడంపై ఆమె ఆనందం వ్యక్తం చేశారు. సొంత కుటుంబంతో ఓ సాయంత్రం గడిపినట్లు ఉందని పేర్కొన్నారు. అనంతరం మాట్లాడుతూ పార్టీ తిరిగి బలోపేతమవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ‘మళ్లీ పుంజుకుంటాం’ అని బలంగా చెప్పిన సోనియా.. ఇదే మా ‘సంకల్పం’ అని అన్నారు. కాంగ్రెస్ బలోపేతానికి ఈ సభ ఎంతగానో ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్న ఆమె.. పార్టీ పుంజుకునేందుకు అందిన సిఫార్సులపై త్వరితగతిన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో