Rivaba Jadeja: జడేజా భార్యగానే కాదు.. పాలిటిక్స్లో ముందు నుంచీ యాక్టివ్! (10 పాయింట్స్)
గుజరాత్ అసెంబ్లీ ఎన్నిక(Gujarat Assembly polls)ల్లో మరోసారి రికార్డు విజయం సాధించాలన్న కసితో ఉన్న భాజపా సుదీర్ఘ కసరత్తు అనంతరం 160 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. క్రికెటర్ రవీంద్రసిన్హా జడేజా భార్య రివాబా జడేజాను జామ్నగర్ నార్త్ నుంచి బరిలో దించుతోంది.
దిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల(Gujarat Assembly polls) కోలాహలం కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో మరోసారి రికార్డు విజయం సాధించాలన్న కసితో ఉన్న భాజపా సుదీర్ఘ కసరత్తు అనంతరం 160 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. సీఎం భూపేంద్ర పటేల్ ఘాట్లోడియా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్టు కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ప్రకటించారు. అలాగే, ఈసారి 75ఏళ్లు దాటిన నేతలను పక్కనబెట్టి యువతకు అవకాశం కల్పించాలని భావించిన కమలనాథులు.. క్రికెటర్ రవీంద్రసిన్హా జడేజా భార్య రివాబా జడేజాకు టిక్కెట్ ఇచ్చారు. జడేజా భార్యగానే కాకుండా గత కొన్నేళ్లుగా రాజకీయాల్లో చురుగ్గా ఉంటోన్న 32 ఏళ్ల రివాబా జామ్నగర్ నార్త్ నుంచి తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఆమె గురించి కొన్ని విశేషాలివే..
- రివాబా జడేజా 1990లో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు హర్దేవ్ సింగ్ సోలంకి, ప్రఫుల్లాబా సోలంకి. క్రికెటర్ రవీంద్ర జడేజాతో వివాహానికి ముందు ఆమెను అందరూ రివా సోలంకి అని పిలిచేవారు.
- రాజ్కోట్లోని ఆత్మియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ కళాశాలలో మెకానికల్ ఇంజినీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఆమె వయస్సు 32ఏళ్లు.
- 2019లో భాజపాలో చేరి రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన రివాబా.. గత కొన్నేళ్లుగా భాజపా తరఫున కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాజ్పుత్ వర్గానికి చెందిన ఆమె కమలదళంలో చేరడానికి ముందు 2018లో కర్ణిసేన మహిళా విభాగానికి చీఫ్గా నియమితులయ్యారు.
- భారత్ ఆల్రౌండర్గా పేరొందిన రవీంద్ర జడేజాతో పరిచయం కాకముందు అతడి సోదరి నైనా, రివాబా మంచి స్నేహితులు. ఆ తర్వాత ఓ పార్టీలో జడేజాను కలిశారు. ఆ తర్వాత ఇద్దరూ డేటింగ్ మొదలుపెట్టారు.
- 2016 ఫిబ్రవరి 5న ఈ ప్రేమ జంటకు నిశ్చితార్థం జరగ్గా.. అదే ఏడాది ఏప్రిల్ 17న వివాహ బంధంతో రవీంద్ర జడేజా- రివాబా ఒక్కటయ్యారు.
- కాంగ్రెస్ సీనియర్ నేత హరిసింగ్ సోలంకికి ఈమె మేనకోడలు.
- గత రెండేళ్లలో ఆమె జామ్నగర్ జిల్లాలో దాదాపు 135 గ్రామాలను సందర్శించారట.
- సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే ఆమెకు ఫేస్బుక్లో 6.77లక్షల మంది, ఇన్స్టాలో 8,385 మంది ఫాలోవర్లు ఉన్నారు.
- జామ్నగర్ జిల్లాలో విస్తృతంగా పర్యటించిన రివాబా ప్రజా సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నారు. బాలికల సంక్షేమం, విద్యతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యంపైనా అవగాహన కల్పిస్తున్నారు.
- తాను స్థాపించిన శ్రీ మాతృశక్తి చారిటబుల్ ట్రస్ట్ పేరిట అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు అవసరమైన సేవలను అందిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తెదేపా శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడిన పోలీసులు
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన తొలిరోజు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. -
‘నాడు-నేడు’ కార్యశాల పేరిట వైకాపా డప్పు
గ్రామ స్వరాజ్యం దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఉందని ప్రభుత్వ విశ్రాంత ముఖ్య కార్యదర్శి, సీఎం సలహాదారుడు అజేయ కల్లం పేర్కొన్నారు. -
భూమన భూముల గుట్టు.. అఫిడవిట్లో రట్టు
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ వైకాపా అభ్యర్థి భూమన అభినయ్రెడ్డి ఎన్నికల అఫిడవిట్ పరిశీలిస్తే.. తితిదే ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ఎంపికలో ఉన్న మర్మం బోధపడుతోంది. -
నేడు నామినేషన్ వేయనున్న పురందేశ్వరి
భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమహేంద్రవరం అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు ఆ పార్టీ కార్యాలయం ప్రకటించింది. -
రాష్ట్రంలో నాలుగు చోట్ల మోదీ సభలు
ఎన్డీయే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ రాష్ట్రంలో నాలుగు బహిరంగ సభలకు హాజరుకానున్నారు. -
అంబటి, అనిల్కుమార్లపై సీఈఓకు తెదేపా ఫిర్యాదు
ఎన్నికల కోడ్కు విరుద్ధంగా టీ కప్పులపై తమ బొమ్మలు ముద్రించి టీ స్టాళ్లకు పంపిణీ చేస్తున్న వైకాపా అభ్యర్థులు అంబటి రాంబాబు, అనిల్కుమార్లపై చర్యలు తీసుకోవాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. -
పొన్నూరు వైకాపా అభ్యర్థిపై చర్యలకు ఆదేశం
గుంటూరు జిల్లా పొన్నూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) ముకేశ్కుమార్ మీనా గురువారం సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. -
రాష్ట్రంలో తొలిరోజు 229 నామినేషన్లు
రాష్ట్రంలో తొలిరోజు లోక్సభ స్థానాలకు 39 నామినేషన్లు, శాసనసభ స్థానాలకు 190 నామినేషన్లు దాఖలయ్యాయి. -
21న తెదేపా అభ్యర్థులకు బి-ఫాంలు
తెదేపా అధినేత చంద్రబాబు ఈ నెల 21న పార్టీ అభ్యర్థులకు స్వయంగా బి-ఫాంలు అందజేయనున్నారు. -
పవన్ సమక్షంలో జనసేనలో చేరికలు
మాజీ మంత్రి దివంగత వట్టి వసంతకుమార్ కుటుంబానికి చెందిన వట్టి పవన్కుమార్ సహా పలువురు నాయకులు గురువారం జనసేనలో చేరారు. -
ఎఫ్ఓఏల ద్వారా ‘ఐ ప్యాక్’కు రూ.270 కోట్ల మళ్లింపు
వాలంటీర్ల పర్యవేక్షణ, శిక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీల(ఎఫ్ఓఏ) ద్వారా సుమారు రూ.270 కోట్లను ఐ ప్యాక్కు జగన్ ప్రభుత్వం మళ్లించిందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
డీసీసీ పదవి కోసం నా కాళ్లు పట్టుకున్న పెద్దిరెడ్డి
తన కాళ్లు పట్టుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డీసీసీ అధ్యక్షుడయ్యారని, లేదంటే కాణిపాకంలో కానీ, తరిగొండలోగానీ ప్రమాణం చేయాలని మాజీ ముఖ్యమంత్రి, భాజపా రాజంపేట ఎంపీ అభ్యర్థి నల్లారి కిరణ్కుమార్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
‘గులకరాయి’ కేసు దర్యాప్తు సాక్షిలోనే ఎందుకొస్తోంది?: వర్ల
సీఎం జగన్పై రాయి దాడి కేసులో పోలీసుల దర్యాప్తు వివరాలు ఒక్క సాక్షి పత్రికలోనే ఎందుకొస్తున్నాయని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ప్రశ్నించారు. -
నామినేషన్ల కోలాహలం షురూ
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల నామినేషన్ల కోలాహలం ప్రారంభమైంది. రాజకీయ సందడి ఊపందుకుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఎన్నికల అధికారులు గురువారం ఉదయం నోటిఫికేషన్లు జారీ చేశారు. -
ఈ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం
వచ్చే సంవత్సర కాలంలో ఏదైనా జరగొచ్చని, లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. -
రాష్ట్ర ప్రభుత్వం సహకరించకున్నా అభివృద్ధి చేశా
ఓటు వేసి గెలిపించిన ఓటరు తలదించుకునేలా తాను ఏ రోజూ వ్యవహరించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. ఐదేళ్లలో తాను చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేయాలని కోరారు. -
పదేళ్లలో రాష్ట్రానికి భారాస, భాజపా చేసింది శూన్యం
గత పదేళ్లలో రాష్ట్రంలోని భారాస, కేంద్రంలోని భాజపా ప్రభుత్వాలు తెలంగాణకు చేసింది శూన్యమని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విమర్శించారు. -
నేటి నుంచి రేవంత్ ప్రచారభేరి
నామినేషన్ల పర్వం మొదలుకావడంతో పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం నుంచి జిల్లాల్లో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్ర ముఖ్య నేతలంతా ప్రచార సభల్లో పాల్గొనేలా పార్టీ ప్రణాళికలు రూపొందిస్తోంది. -
తేనీటి వెనక కన్నీటి ధారలు!
మన దేశంలో వేడివేడి ఛాయ్ మజాను ఆస్వాదించనివారు అరుదు. చాలా ఇళ్లలో చుట్టాలకు తొలి పలకరింపు తేనీటితోనే! పని ఒత్తిడి నుంచి కాస్త విరామం తీసుకునేటప్పుడు.. స్నేహితులతో పిచ్చాపాటి మాట్లాడేటప్పుడు.. చాలామందికి టీ కప్పు చేతిలో ఉండాల్సిందే!! -
12 మందికి నేరచరిత్ర
రాజస్థాన్లో లోక్సభకు పోటీ చేస్తున్న 12 మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులున్నాయి. వారిలో కొందరిపై హత్య కేసులూ ఉన్నాయి. -
నవనీత్ రాణా.. ఓ నృత్యకారిణి
మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ స్థానం నుంచి పోటీచేస్తున్న భాజపా అభ్యర్థి, సినీనటి నవనీత్ రాణాపై శివసేన(యూబీటీ) నేత సంజయ్రౌత్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి తెరతీశాయి.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
మహిళకు శస్త్రచికిత్స చేసి తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి