karnataka election 2023: కర్ణాటక కాంగ్రెస్ విజయం వెనుక ‘మిస్టర్ కె’..!
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం వెనుక ఓ రాజకీయ వ్యూహకర్త మేధస్సు ఉంది. పార్టీ ప్రచార తీరు నుంచి టికెట్ల పంపిణీ వరకు అన్నీ తానై చూసుకొన్నారు. పార్టీలోని వివిధ వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి విజయపథంలో నడిపించారు.
ఇంటర్నెట్డెస్క్: అతడో రాజకీయ వ్యూహకర్త.. పూర్తిగా లోప్రొఫైల్లో ఉంటారు. సామాజిక మాధ్యమాల్లో వెతికినా కనిపించరు.. తన వాట్సాప్ ఖాతాలో ఫొటో కూడా పెట్టుకోరు. మీడియా కూడా ఆయన ఫొటో కోసం ఆపసోపాలు పడిన సందర్భాలున్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్(Congress) విజయం (karnataka election 2023)అన్నీ తానై వ్యవహరించిన చతురుడు. టికెట్ల పంపిణీ నుంచి ప్రచారం వరకు అతి జాగ్రత్తగా పర్యవేక్షించారు. ఆయన పేరు సునీల్ కనుగోలు(Sunil Kanugolu)..! ప్రస్తుతం కాంగ్రెస్ చీఫ్ ఎలక్షన్ స్ట్రాటజిస్ట్.
2014లో మోదీతో కలిసి..
సునీల్ కర్ణాటకలోని బళ్లారిలో పుట్టారు. ఆ తర్వాత చదువు నిమిత్తం చెన్నైకి మకాం మార్చారు. అనంతరం అమెరికా వెళ్లి ఎంబీఏ చదివారు. తర్వాత అక్కడే అంతర్జాతీయ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ మెకన్సీ కోసం పనిచేశారు. భారత్కు వచ్చిన తర్వాత గుజరాత్ రాజకీయ వ్యూహాల్లో చురుగ్గా పనిచేశారు. ‘ది అసోసియేషన్ ఆఫ్ బిలియన్ మైండ్స్’కు చీఫ్గా పనిచేశారు. 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ వ్యూహకర్తల బృందంలో సునీల్ కూడా ఒకరు. ఆ తర్వాత భాజపా కోసం యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పనిచేశారు. 2019లో తమిళనాట స్టాలిన్ కోసం పనిచేసి సునీల్ డీఎంకేకు 38 పార్లమెంట్ స్థానాల్లో గెలిపించడంలో కీలకపాత్ర పోషించారు. ఈ ఎన్నికలే స్టాలిన్ను తమిళనాడులో తిరుగు లేని నేతగా నిలబెట్టాయి. ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్కు చెందిన ఐప్యాక్ బృందం డీఎంకేకు సేవలందించడంతో సునీల్ బెంగళూరుకు వెళ్లిపోయారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో నాటి సీఎం పళనిస్వామి కోరికమేరకు అన్నాడీఎంకేకు పనిచేశారు.
బొమ్మై మాటను కాదని.. కాంగ్రెస్తో కలిసి..
గతేడాది మార్చిలో సునీల్ కనుగోలు కాంగ్రెస్తో కలిసే నాటికి ఆ పార్టీలో ఎన్నికల సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. అతడు హస్తం పార్టీతో జట్టుకట్టే విషయం తెలిసి.. కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై అతడిని భాజపాలోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా యత్నించారు. కానీ, ఆయన విజ్ఞప్తిని సునీల్ తిరస్కరించారు. తాను కాంగ్రెస్ భావజాలాన్ని నమ్ముతున్నట్లు వెల్లడించారు. ఆయన కాంగ్రెస్లోకి నాటికి వర్గపోరు తీవ్రంగా ఉంది. రాహుల్, ప్రియాంక మద్దతుతో సునీల్ ఎన్నికల బాధ్యతలు స్వీకరించి ఓ వ్యూహకర్తల బృందాన్ని ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ 4,080 కిలోమీటర్ల మేరకు నిర్వహించిన ‘భారత్ జోడో యాత్ర’లో ఆయన వ్యూహం ఉంది. ఇక కర్ణాటక కాంగ్రెస్లో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ వర్గాలను ఏకతాటిపైకి తీసుకొచ్చి పనిచేశారు.
కర్ణాటక కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ముఖ్యమంత్రి బొమ్మైపై 40శాతం కమీషన్లు తీసుకొంటున్నట్లు చేసిన ఆరోపణలను అవకాశంగా తీసుకొని ‘పేసీఎం’ పేరిట ప్రచారం నిర్వహించారు. ఇక అమూల్ వర్సెస్ నందినీ డెయిరీల వ్యహారాన్ని కన్నడిగుల ఆత్మగౌరవంతో ముడిపెట్టి ప్రచారం చేయడంలో సునీల్ బృందం పాత్ర ఉంది. మరోవైపు భాజపా భావోద్వేగాలను రెచ్చగొట్టే అంశాలతో ప్రచారానికి వెళుతుండగా.. కాంగ్రెస్ మేనిఫెస్టో మాత్రం పూర్తిగా సామాన్యులను ప్రభావితం చేసే అంశాలు ఉండేలా ఈ బృందం జాగ్రత్తలు తీసుకొంది. కర్ణాటకలో చివరికి టికెట్ల పంపిణీల్లో సునీల్ బృందం సర్వే సూచనల మేరకే కాంగ్రెస్ అధినాయకత్వం చాలా కేటాయింపులు చేసింది.
భాజపాను అడ్డుకోవడానికి నిత్యం 20 గంటలు శ్రమించాల్సి వచ్చిందని సునీల్ ఓ ఆంగ్లపత్రికకు వెల్లడించారు. ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీలో సునీల్ మరింత కీలకంగా మారారు. తెలంగాణ, చత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కోసం పనిచేయనున్నారు. గతేడాది ఆయన పార్టీ తరపున పనిచేయడం మొదలుపెట్టిన రెండు నెలలకే సోనియా గాంధీ ఆయన్ను 2024 లోక్సభ ఎలక్షన్ టాస్క్ఫోర్స్లో సభ్యుడిగా నియమించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భారాసను ఓడించి శిక్ష విధించినా ఆ పార్టీ నేతలు అహంకారాన్ని వీడటం లేదని భాజపా ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. -
కొనసాగుతున్న మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్నారు. -
కంగనపై వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రియా శ్రీనేత్కు కాంగ్రెస్ షాక్!
Congress: కంగనా రనౌత్పై కాంగ్రెస్ నేత సుప్రియ శ్రీనేత్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో ఆమెను పార్టీ తాజా లోక్సభ అభ్యర్థుల జాబితా నుంచి తప్పించింది. -
ఇంటికి కిలో బంగారం పంచినా జగన్కు ఓటమే
అయిదేళ్ల అరాచక పాలనతో విసిగిన జనం.. జగన్ను తాడేపల్లి ప్యాలెస్లో శాశ్వతంగా బంధించేందుకు నిర్ణయించుకున్నారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. -
నగదు, మద్యం దొరికినా అధికారులు స్పందించరేం?
తిరుపతి సమీపంలోని రేణిగుంట వద్ద వైకాపా నేతలకు చెందిన మద్యం, నగదు, ప్రచార సామగ్రి డంప్లు దొరికినా.. జిల్లా కలెక్టర్, ఆర్వోలు చర్యలు తీసుకోకపోవడం వెనుక ఆంతర్యం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. -
ప్రకాశం ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కుకు కేటాయించాలి: సీపీఎం
ప్రకాశం జిల్లా యర్రజర్లకొండ ఇనుప ఖనిజాన్ని విశాఖ ఉక్కు కర్మాగారానికి సొంత గనుల కింద కేటాయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు లేఖ రాశారు. -
రాయలసీమ ద్రోహిని అడ్డుకోండి
యాత్రపేరుతో పరదాల చాటు నుంచి ముసుగువీరుడు బయటకొచ్చారని... ‘జగన్ నువ్వు రాయలసీమ ద్రోహివి.. ఇక్కడికి రావడానికి వీల్లేదు’ అని జనం గట్టిగా చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. -
ముందు చెల్లికి సమాధానం చెప్పాలి
బస్సు యాత్ర పేరిట ఇడుపులపాయకు వెళ్లిన జగన్... బాబాయిని గొడ్డలితో చంపించిన వ్యక్తిని వెంట బెట్టుకుని బయటకొచ్చారని, అయిదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న చెల్లి సునీత ఆవేదనను పట్టించుకోక పోవడమే కాకుండా సొంత చెల్లి షర్మిలకూ అన్యాయం చేశారని చంద్రబాబు విమర్శించారు. -
రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డికి అసమ్మతి సెగ
‘పరిటాల కుటుంబంతో పోరాటం అన్నది నా ఒక్కడితో సాధ్యం కాదు.. ఇప్పటికే ఒకసారి ఓడిపోయి ఇల్లు అమ్ముకొని రోడ్డున పడ్డానని ప్రకాశ్రెడ్డి అంటే ఆయనను ఇంట్లో కూర్చోబెట్టాం..మమ్మల్ని మాత్రం ఆయన రోడ్డున పడేశారు. -
మట్టి మింగేస్తున్నారు.. మనుషుల్ని చంపేస్తున్నారు
‘వైకాపా పాలనలో అక్రమ తవ్వకాలతో మట్టిని మింగేస్తున్నారు.. ప్రశ్నించిన మనుషులనూ చంపేస్తున్నారు. రాష్ట్రంలో అరాచకం రాజ్యమేలుతోంది. -
పవన్కల్యాణ్తో నాయకుల సమావేశం
ఒంగోలు ఎంపీ, తెదేపా నేత మాగుంట శ్రీనివాసులురెడ్డి.. జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్తో భేటీ అయ్యారు. -
తెలిసే.. వదిలేశారా?
అధికార వైకాపా తాయిలాల పంపిణీలో దూసుకుపోతుంటే తిరుపతి జిల్లా యంత్రాంగం చోద్యం చూస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. -
లోక్సభ, అసెంబ్లీ స్థానాల్లో మూడు పార్టీల ఉమ్మడి భేటీలు
ఎన్నికల కార్యాచరణ, క్షేత్రస్థాయిలో ప్రచార వ్యూహాల రూపకల్పన తదితర అంశాలపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించాలని తెదేపా, జనసేన, భాజపా నిర్ణయించాయి. -
కేసుల్లోనూ నంబర్ వన్ ముఖ్యమంత్రి జగనే
దేశంలోని ముఖ్యమంత్రులు అందరిలోకెల్లా ధనవంతుడైన జగన్.. కేసుల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారని మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నేత దీపక్రెడ్డి ఎద్దేవా చేశారు. -
అనంతపురం జిల్లాలో ఘోరం..
అనంతపురం జిల్లా శింగనమల మండల వైకాపా మాజీ కన్వీనర్, అసమ్మతి నాయకుడు పట్నం నగేశ్ మామిడి తోటకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. -
భాజపా అసెంబ్లీ అభ్యర్థులు వీరే
రాష్ట్రంలో పోటీ చేయనున్న పది అసెంబ్లీ స్థానాలకు భాజపా అధినాయకత్వం బుధవారం అభ్యర్థుల్ని ప్రకటించింది. వీరిలో సుజనాచౌదరికి కేంద్ర మంత్రిగా, కామినేని శ్రీనివాస్, ఆదినారాయణరెడ్డిలకు రాష్ట్ర మంత్రులుగా వ్యవహరించిన అనుభవం ఉంది. -
క్యాష్ కొట్టు.. బస్సులు పట్టు
ఇటీవల వైకాపా నిర్వహించిన నాలుగు సిద్ధం సభలకు 8,700 ఆర్టీసీ బస్సులు తీసుకున్నారు. వీటికి ఆ పార్టీ దాదాపు రూ.20 కోట్ల వరకు చెల్లించింది. -
భాజపా లోక్సభ స్థానాలకు ఇన్ఛార్జుల నియామకం
రాష్ట్రంలో భాజపా పోటీ చేస్తున్న లోక్సభ స్థానాలకు సీనియర్ నేతలను ఇన్ఛార్జులుగా ఆ పార్టీ నియమించింది. వీరిలో నలుగురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఉన్నారు. -
డబ్బు తరలించడానికే ఆ కంటెయినర్
అయిదేళ్లుగా అడ్డదారిన ఆర్జించిన రూ.వేల కోట్ల సొమ్మంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి కంటెయినర్లో తరలించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వైకాపా అభ్యర్థులకు పంచడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. -
తొలిదశకు ముగిసిన నామినేషన్లు
లోక్సభ ఎన్నికల తొలిదశకు నామినేషన్ల గడువు బుధవారం ముగిసింది. ఏప్రిల్ 19న 21 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. -
టీఎంసీ దోచుకున్న సొమ్ము పేదలకే
పశ్చిమబెంగాల్లో పేదల నుంచి కొందరు దోచుకున్న రూ.3,000 కోట్లు తిరిగి బడుగులకే దక్కేలా చూసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
రషీద్ బౌలింగ్లో సిక్స్లు.. ధోనీ సలహాలు పాటించా: సమీర్ రిజ్వీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
గూగుల్ కృత్రిమ మేధ నిపుణులకు జుకర్బర్గ్ గాలం?
-
గత సీజన్లో విదేశీ క్రికెటర్లకు ఆ కోచ్ తీరు నచ్చలేదు: కోల్కతా మాజీ ఆటగాడు
-
కేసీఆర్ ఎవరినీ నమ్మలేదు.. అందుకే ఫోన్ ట్యాపింగ్: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ