ఎన్నికలపై ఉన్న శ్రద్ధ కరోనా నియంత్రణపై లేదేం?

ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల్లో గెలవడంపై పెట్టిన శ్రద్ధ.. కరోనాపై పోరులో ఎందుకు పెట్టడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ ట్విటర్‌ వేదికగా మోదీని విమర్శించారు.

Published : 21 Apr 2021 01:40 IST

దిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల్లో గెలవడంపై పెట్టిన శ్రద్ధ.. కరోనాపై పోరులో ఎందుకు పెట్టడం లేదంటూ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ ట్విటర్‌ వేదికగా మోదీని విమర్శించారు. ‘కరోనా వైరస్‌ రెండో దశ ఉద్ధృతితో దేశం సతమతమవుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోదీ బాధ్యతలు విస్మరించి పశ్చిమబెంగాల్‌లో ఎన్నికల ర్యాలీల్లో పాల్గొంటున్నారు. ఎన్నికల్లో గెలవడానికి తన కండ బలాన్ని, గుండె బలాన్ని, వనరుల్ని అన్నింటినీ ఉపయోగిస్తున్నారు. మరి అదే శ్రద్ధ కరోనా వైరస్‌పై పోరులో అఎందుకు చూపడం లేదు?’ అని కపిల్‌ సిబల్‌ ప్రశ్నించారు. కాగా, బెంగాల్‌లో తదుపరి ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ ర్యాలీలను నిర్వహించకూడదని భాజపా సోమవారమే నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని