‘లఖింపుర్ దోషుల్ని 7రోజుల్లో అరెస్టు చేయకపోతే మోదీ ఇంటిని ముట్టడిస్తాం!’
ఉత్తర్ప్రదేశ్లోని లఖింపుర్ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో దోషుల్ని అరెస్టు చేయాలని ఆజాద్ సమాజ్వాదీ పార్టీ చీఫ్, దళిత నాయకుడు........
ఆజాద్ సమాజ్వాదీ పార్టీ నేత చంద్రశేఖర్ ఆజాద్ హెచ్చరిక
దిల్లీ: ఉత్తర్ప్రదేశ్లోని లఖింపుర్ ఖేరిలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలో దోషుల్ని అరెస్టు చేయాలని ఆజాద్ సమాజ్వాదీ పార్టీ చీఫ్, దళిత నాయకుడు చంద్రశేఖర్ ఆజాద్ డిమాండ్ చేశారు. ఏడు రోజుల్లోగా అరెస్టు చేయకపోతే ప్రధాని నరేంద్ర మోదీ నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ప్రతి విషయంపైనా ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్లు చేస్తారనీ.. మరి, రైతుల్ని చంపిన ఘటనపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దోషులు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటూ మండిపడ్డారు. ప్రధాని మోదీ లఖ్నవూలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ జరుపుకొంటున్న వేళ రైతుల కుటుంబాలు అక్కడ రోదిస్తున్నాయన్నారు. ప్రధాని మోదీ లఖింపుర్ ఖేరి వెళ్లి ఆ రైతు కుటుంబ సభ్యులను పరామర్శించాలని కోరారు. యూపీలో శాంతిభద్రతలు లేవని, సీఎం యోగి ఆదిత్యనాథ్ తన పదవికి రాజీనామా చేయాలని ఆజాద్ డిమాండ్ చేశారు.
ఆ కేంద్రమంత్రిని బర్త్రఫ్ చేయాల్సిందే..: కాంగ్రెస్ డిమాండ్
లఖింపుర్ ఖేరి ఘటన నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రాను పదవి నుంచి డిస్మిస్ చేయాలని, ఆయన కుమారుడు అశీష్ని వెంటనే అరెస్టు చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనలపై ఇద్దరు సిట్టింగ్ జడ్జిలతో దర్యాప్తు జరిపించి బాధిత రైతుల కుటుంబాలకు 30 రోజుల్లో న్యాయం చేయాలని కాంగ్రెస్ నేత రణ్దీప్ సూర్జేవాలా కోరారు. ప్రధాని నరేంద్ర మోదీ రాజధర్మాన్ని పాటించి.. నిందితులను అరెస్టు చేయించాలన్నారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అజయ్ మిశ్రాను మంత్రివర్గం నుంచి బర్త్రఫ్ చేసి.. నిందితుందరినీ అరెస్టు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అన్నారు. ఇద్దరు సిట్టింగ్ జడ్జిలతో కమిషన్ ఏర్పాటు చేసి దోషులను 30 రోజుల్లో శిక్షిస్తేనే రాజ్యాంగం, చట్టం పరిరక్షించబడతాయన్నారు. లేకపోతే వాటిపై ప్రజలు విశ్వాసం కోల్పోతారన్నారు. ఇప్పటివరకు ఏ ఒక్క నిందితుడినీ అరెస్టు చేయలేదని సూర్జేవాలా విమర్శించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
ధోనీని అంత కోపంగా నేనెప్పుడూ చూడలేదు: సురేశ్ రైనా
-
నిర్మాతల నుంచి పవన్కల్యాణ్ తీసుకున్న అప్పు ఎంతో తెలుసా?
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM