LJP: ఆర్జేడీతో పొత్తుపై చిరాగ్ పాసవాన్ సంకేతాలు
లోక్ జన శక్తి (ఎల్జేపీ) పార్టీ వ్యవస్థాపకుడు రాంవిలాస్ పాసవాన్ సోదరుడు పశుపతికుమార్ పరస్ ఆ పార్టీపై తిరుగుబాటు అనంతరం బిహార్ రాజకీయాల్లో అనూహ్యమైన రాజకీయ మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి....
పాట్నా: లోక్ జనశక్తి (ఎల్జేపీ) పార్టీ వ్యవస్థాపకుడు రాంవిలాస్ పాసవాన్ సోదరుడు పశుపతికుమార్ పరాస్ ఆ పార్టీపై తిరుగుబాటు అనంతరం బిహార్ రాజకీయాల్లో అనూహ్యమైన రాజకీయ మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాబాయి తిరుగుబాటు తరువాత పార్టీలో ఒంటరిగా మారి.. భాజపా తనకు అండగా నిలబడలేదని అసంతృప్తిగా ఉన్న ఎల్జేపీ అధినేత చిరాగ్ పాసవాన్ రాష్ట్రీయ జనతాదల్ (ఆర్జేడీ)తో స్నేహంపై సంకేతాలిచ్చారు. బిహార్లో ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఆర్జేడీతో పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని చిరాగ్ పేర్కొన్నారు.
తన తండ్రి రాంవిలాస్ పాసవాన్, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ స్నేహితులని చిరాగ్ గుర్తుచేసుకున్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, తాను కూడా మంచి మిత్రులమని.. తేజస్వీ తనకు చిన్న తమ్ముడి లాంటివారని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో తాను రాముడికి హనుమంతుడిలా అండగా ఉంటే.. ఆయన తనకు సాయం చేయలేదని చిరాగ్ ఆవేదన వ్యక్తం చేశారు. హనుమంతుడిపై రాజకీయ కుట్ర జరుగుతుంటే రాముడు మౌనంగా చూస్తూ ఉండబోరని నమ్ముతున్నట్లు చిరాగ్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
వైకాపాకు కొమ్ము కాస్తున్న పోలీసులు ఇకనైనా పార్టీ కండువాలు తీసి డ్యూటీ చేయాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యులు బొండా ఉమా హితవు పలికారు. -
లిక్కర్, మైనింగ్ రంగాల్లో రూ.లక్షల కోట్ల అవినీతి
రాష్ట్రంలో లిక్కర్, మైనింగ్ రంగాల్లో లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి జరుగుతోందని భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జ్ సిద్ధార్థ్నాథ్సింగ్ ధ్వజమెత్తారు. -
బ్యాలెట్ బాక్సులతోనే ‘స్థానిక’ ఎన్నికలు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎన్నికలను బ్యాలెట్ బాక్సులతో నిర్వహించాలని నిర్ణయించింది.
తాజా వార్తలు (Latest News)
-
విజయ్ దేవరకొండ - ప్రశాంత్ నీల్ మీట్.. ఆ హిట్ ప్రాజెక్ట్ కోసమేనా..?
-
పోలీసులు ఇకనైనా వైకాపా కండువాలు తీసి డ్యూటీ చేయాలి: బొండా ఉమా
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్