LJP: ఆర్జేడీతో పొత్తుపై చిరాగ్‌ పాసవాన్‌ సంకేతాలు

లోక్‌ జన శక్తి (ఎల్‌జేపీ) పార్టీ వ్యవస్థాపకుడు రాంవిలాస్‌ పాసవాన్‌ సోదరుడు పశుపతికుమార్‌ పరస్‌ ఆ పార్టీపై తిరుగుబాటు అనంతరం బిహార్‌ రాజకీయాల్లో అనూహ్యమైన రాజకీయ మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి....

Updated : 27 Jun 2021 05:30 IST

పాట్నా: లోక్‌ జనశక్తి (ఎల్‌జేపీ) పార్టీ వ్యవస్థాపకుడు రాంవిలాస్‌ పాసవాన్‌ సోదరుడు పశుపతికుమార్‌ పరాస్‌ ఆ పార్టీపై తిరుగుబాటు అనంతరం బిహార్‌ రాజకీయాల్లో అనూహ్యమైన రాజకీయ మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాబాయి తిరుగుబాటు తరువాత పార్టీలో ఒంటరిగా మారి.. భాజపా తనకు అండగా నిలబడలేదని అసంతృప్తిగా ఉన్న ఎల్‌జేపీ అధినేత చిరాగ్‌ పాసవాన్‌ రాష్ట్రీయ జనతాదల్‌ (ఆర్జేడీ)తో స్నేహంపై సంకేతాలిచ్చారు. బిహార్‌లో ఎన్నికల సమయం వచ్చినప్పుడు ఆర్జేడీతో పొత్తుపై తుది నిర్ణయం తీసుకుంటామని చిరాగ్‌ పేర్కొన్నారు. 

తన తండ్రి రాంవిలాస్‌ పాసవాన్‌, ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌ యాదవ్‌ స్నేహితులని చిరాగ్‌ గుర్తుచేసుకున్నారు. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌, తాను కూడా మంచి మిత్రులమని.. తేజస్వీ తనకు చిన్న తమ్ముడి లాంటివారని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ విషయంలో తాను రాముడికి హనుమంతుడిలా అండగా ఉంటే.. ఆయన తనకు సాయం చేయలేదని చిరాగ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. హనుమంతుడిపై రాజకీయ కుట్ర జరుగుతుంటే రాముడు మౌనంగా చూస్తూ ఉండబోరని నమ్ముతున్నట్లు చిరాగ్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు