BJP: డిసెంబర్ 5నుంచి భాజపా కీలక సమావేశాలు.. అజెండా ఇదేనా?
గుజరాత్ మలి దశ ఎన్నికల పోలింగ్ (డిసెంబర్ 5న) సోమవారం జరగడంతో అదే రోజు నుంచి రెండు రోజుల పాటు దిల్లీలో పార్టీ కీలక సమావేశాలు నిర్వహించాలని కమలనాథులు నిర్ణయించారు.
దిల్లీ: గుజరాత్ ఏడోసారి విజయం సాధించడమే లక్ష్యంగా భాజపా నేతలు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. మోదీ, అమిత్ షా స్వరాష్ట్రమైన గుజరాత్లో రికార్డు స్థాయిలో గెలిచి తమ సత్తా చాటాలని సర్వశక్తులూ ధారపోస్తున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ మొదలుకొని ఆ పార్టీ అగ్రనేతలు అక్కడ చురుగ్గా ప్రచారంలో పాల్గొంటూ బిజీబిజీగా గడుపుతున్నారు. అయితే, గుజరాత్ మలి దశ ఎన్నికల పోలింగ్ (డిసెంబర్ 5న) సోమవారం జరగడంతో అదే రోజు నుంచి రెండు రోజుల పాటు దిల్లీలో పార్టీ కీలక సమావేశాలు నిర్వహించాలని కమలనాథులు నిర్ణయించారు. దేశవ్యాప్తంగా భాజపా ముఖ్య నేతలు పాల్గొనే ఈ సమావేశాల్లో వచ్చే ఏడాది జరగబోయే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 లోక్సభ ఎన్నికల సవాళ్లను ఎదుర్కొనేందుకు పార్టీ సన్నద్ధతపై సమీక్షించనున్నట్టు తెలుస్తోంది.
భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన ప్రారంభం కానున్న ఈ రెండ్రోజుల సమావేశాల్లో పార్టీ సంస్థాగత అంశాలతో పాటు భారత్కు జీ20 అధ్యక్ష బాధ్యతలు, ప్రపంచ మందగమనం నేపథ్యంలో భారత ఆర్థిక వృద్ధి తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. వీటితో పాటు వచ్చే ఏడాది జరగబోయే త్రిపుర, కర్ణాటకతో పాటు పలు ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఈ ఆఫీస్ బేరర్ల చర్చించనున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశాలకు జాతీయ స్థాయిలో పార్టీ సీనియర్ నేతలతో పాటు అన్ని రాష్ట్రాల భాజపా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శలు పాల్గొననున్నారు. ఈ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రసంగించే అవకాశం ఉన్నట్టు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు
గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలనే ఏకైక డిమాండ్తో యుగతులసి పార్టీ జాతీయ అధ్యక్షుడు కొలిశెట్టి శివకుమార్ లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. -
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం
మహారాష్ట్రలోని షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి ప్రణితి షిండేకు మద్దతుగా ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ ప్రచారం చేస్తున్నట్లుగా ఓ డూప్ ఉన్న ఓ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం