Shiv sena: శిందే వర్గం చేతికి శివసేన.. ఆ రెండింటి మాటేంటి?
Shiv Sena Bhavan - Saamana: రెండుగా చీలిన శివసేనకు సంబంధించి పార్టీ గుర్తు, పార్టీ పేరు ఇప్పటికే ఏక్నాథ్ శిందే వర్గానికి చేరాయి. మరి పార్టీ ప్రధాన కార్యాలయం, సామ్నా పత్రికపై హక్కుల మాటేంటి?
ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే (Eknath Shinde) వర్గానిదే అసలైన శివసేన (Shiv Sena) అంటూ ఎన్నికల సంఘం ఇటీవల తీర్పు ఇచ్చింది. పార్టీ గుర్తైన విల్లు-బాణం సైతం ఆ వర్గానికే కేటాయించింది. దీంతో అందరి దృష్టీ పార్టీ ప్రధాన కార్యాలయం అయిన ‘శివసేన భవన్’, పార్టీ అధికారిక పత్రిక ‘సామ్నా’ (Saamana)పై పడింది. ప్రస్తుతం ఈ రెండూ ఠాక్రే వర్గం చేతిలో ఉన్నాయి. వీటిని సైతం శిందే వర్గం స్వాధీనం చేసుకుంటుందా? అనే ఊహాగానాలు మొదలయ్యాయి.
శివసేన పార్టీ ప్రధాన కార్యాలయం అయిన ‘శివసేన భవన్’ సెంట్రల్ ముంబయిలోని దాదర్ ప్రాంతంలో ఉంది. ‘సామ్నా’ పత్రిక ప్రధాన కార్యాలయం ప్రభదేవి ప్రాంతంలో ఉంది. అయితే, ఈ రెండూ వేర్వేరు ట్రస్టుల పేరు మీద నడుస్తున్నాయి. పార్టీ ప్రధాన కార్యాలయం అయిన శివసేన భవన్.. శివాయి సేవా ట్రస్ట్ పేరుమీద నడుస్తోంది. బాల్ ఠాక్రే, ఆయన భార్య మీనా ఠాక్రే వ్యవస్థాపక ట్రస్టీలుగా ఉన్నారు. ఉద్ధవ్ ఠాక్రే సహా మరికొందరు ప్రస్తుతం ట్రస్టీలుగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు ట్రస్టీలు ఉన్నప్పటికీ.. అందులో చాలా మంది కాలం చేశారు.
బాల్ ఠాక్రే ప్రారంభించిన ‘సామ్నా’ ప్రభోదన్ ప్రకాశన్ అనే ట్రస్ట్ పేరుమీద నడుస్తోంది. ఉద్ధవ్ ఠాక్రేకు ఆప్తుడైన సుభాష్ దేశాయ్ దీనికి ప్రింటర్-పబ్లిషర్గా వ్యవహరిస్తున్నారు. 2019 ఎన్నికలకు ముందు వరకు ఈ పత్రికకు ఉద్ధవ్ ఎడిటర్గా వ్యవహరించారు. సీఎం అయ్యాక ఆయన సతీమణి రష్మీ ఠాక్రేకు ఆ బాధ్యతలు అప్పగించారు. గతేడాది ఆగస్టులో ఉద్ధవ్ మళ్లీ ఎడిటర్గా బాధ్యతలు స్వీకరించారు. ‘సామ్నా’కు సంజయ్ రౌత్ ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు.
అయితే, శివసేన భవన్, సామ్నా విషయంలో ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే ఇప్పటికే స్పష్టతనిచ్చారు. పార్టీ పేరు, గుర్తు తన చేతికి వచ్చినప్పటికీ.. శివసేన భవన్, సామ్నాపై మాత్రం హక్కులను కోరబోనని పేర్కొన్నారు. అయినప్పటికీ ఠాక్రే వర్గం మాత్రం అప్రమత్తంగా ఉంది. ఇటీవలే ఆ పార్టీకి చెందిన నేత ఒకరు థానే పోలీస్ కమిషనర్కు కలిసి వినతి పత్రం సమర్పించారు. శాఖలను (పార్టీ ప్రాంతీయ కార్యాయాలు) శిందే వర్గం స్వాధీన ప్రయత్నాలు అడ్డుకోవాలన్నది అందులోని సారాంశం.
శివసేన భవన్, సామ్నాపై హక్కు విషయంలో ఏక్నాథ్ శిందే వివేకంతో నిర్ణయం తీసుకున్నారని సీనియర్ జర్నలిస్టు ప్రకాశ్ అకోల్కర్ అన్నారు. ప్రస్తుతం రెండు వేర్వేరు ట్రస్టుల కింద నడుస్తున్న వాటిపై హక్కులను కోరితే మరిన్ని న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ముంబయి, నగరం ఆవల సుమారు 350 శివసేన శాఖలు ఉన్నాయి. అయితే, ఇవి చాలా వరకు శాఖ ప్రముఖుల చేతిలోనో, ఆ కార్యాలయాలకు స్థలాలు ఇచ్చిన ప్రైవేటు వ్యక్తుల చేతిలోనో ఉన్నాయి. భవిష్యత్లో ఏ పార్టీకి ఇవి చెందుతాయనేది మాత్రం వారి నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత బాగా ఉందని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. -
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
మహారాష్ట్రలోని బారామతిలో ఉత్కంఠ పోరు నెలకొంది. పవార్ కుటుంబంలోని ఇద్దరు మహిళలు పరస్పరం తలపడటం ఉత్కంఠ రేపుతోంది. -
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో ఎన్డీఏ కూటమి నేతలు ప్రచారంలో దూకుడు పెంచారు. -
తెదేపా అభ్యర్థులకు ఈనెల 21న బీఫామ్లు ఇవ్వనున్న చంద్రబాబు
తెలుగుదేశం అభ్యర్థులకు అధినేత చంద్రబాబు ఈనెల 21న బీఫామ్లు అందజేయనున్నారు. -
మంగళగిరిలో నారా లోకేశ్ నామినేషన్.. తెదేపా శ్రేణుల భారీ ర్యాలీ
గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ స్థానానికి తెదేపా అభ్యర్థిగా నారా లోకేశ్ నామినేషన్ దాఖలు చేశారు. -
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
చంద్రబాబు సమక్షంలో తెదేపాలో చేరిన భీమిలి, జీడీ నెల్లూరు వైకాపా నేతలు
భీమిలి, జీడీ నెల్లూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు వైకాపా నేతలు తెదేపా అధినేత చంద్రబాబు సమక్షంలో గురువారం ఆ పార్టీలో చేరారు. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. -
పెద్ద కోటల్లో ఉండే జగన్.. ఎన్నికల వేళ బయటకు వస్తున్నారు: షర్మిల
వైఎస్ఆర్ హయంలో హంద్రీనీవా ప్రాజెక్టు 90 శాతం పూర్తి అయిందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పూర్తి చేసి -
వివేకా వ్యక్తిగత జీవితాన్ని బయటపెట్టి తీవ్రంగా అవమానిస్తున్నారు: సునీత
మాజీ మంత్రి వివేకానందరెడ్డి 40 ఏళ్లుగా ఈ ప్రాంతానికి సేవ చేశారని ఆయన కుమార్తె సునీత అన్నారు. వివేకాను అత్యంత దారుణంగా హతమార్చారని ఆవేదన వ్యక్తం చేశారు. -
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. తొలిరోజు వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలు భారీ ర్యాలీలతో ఆర్వో కార్యాలయాల వద్దకు చేరుకుని నామినేషన్ పత్రాలను సమర్పించారు. -
కళ్యాణదుర్గంలో వైకాపా అరాచకం.. దాడిలో తెదేపా నేతకు తీవ్ర గాయాలు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అధికార పార్టీకి చెందిన గూండాలు అరాచకం సృష్టించారు. -
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
కాంగ్రెస్కు రాష్ట్రం, రైతుల కంటే రాజకీయాలే ముఖ్యమని స్పష్టమైందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. -
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
ఎవరూ ఊహించని రీతిలో అత్యధిక స్థానాల్లో భాజపా (BJP) విజయం సాధించబోతోందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy) అన్నారు. -
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. -
వాల్తేరు క్లబ్లో వైకాపా డిష్యుం డిష్యుం!
వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి. ఈ రోజుకూ నేను అదే చెబుతున్నా. ఏ రోజైనా ఒక సామాజికవర్గం చేతిలో ఉండి ఉండొచ్చు. -
నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections) నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. -
చీకటి పాలనకు చిరునామా.. జగనన్న కాలనీలు!
ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తాం.. అంటూ జగనన్న కాలనీల విషయంలో సీఎం జగన్ మొదటి నుంచీ గొప్పలు చెబుతున్నారు. -
వ్యూహకర్తలదే పెత్తనం!.. ప్రచారంలో పార్టీలను శాసించేది వారే
భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి.
తాజా వార్తలు (Latest News)
-
స్వదేశంలో జోఫ్రా ఆర్చర్ వరల్డ్ కప్ ఆడటం కష్టమేనా..?
-
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో రాజకీయ గందరగోళం: కేసీఆర్
-
ఆ దేశమంతా వర్క్ ఫ్రమ్ హోమ్.. కారణమేమిటంటే..?
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ