Andhra News: జగన్‌ ప్రసంగం మధ్యలోనే వెళ్లిపోయిన మహిళలు

ఏలూరు జిల్లా గణపవరంలో ఇవాళ ‘వైఎస్సాఆర్‌ రైతు భరోసా’ నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు.

Updated : 16 May 2022 16:31 IST

గణపవరం: ఏలూరు జిల్లా గణపవరంలో ఇవాళ ‘వైఎస్సాఆర్‌ రైతు భరోసా’ నిధుల విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్‌ ప్రసంగించారు. సీఎం ప్రసంగిస్తుండగా మధ్యలోనే మహిళలు లేచి వెళ్లిపోయారు. దీంతో సభా ప్రాంగణం ఖాళీగా మారింది. మరోవైపు సీఎం పర్యటన సందర్భంగా గణపవరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. దుకాణాలు, ఆస్పత్రులు మూయించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆస్పత్రికి వెళుతుండగా పోలీసులు ఆపారని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని