Mamata Banerjee: కర్ణాటక ఎన్నికల్లో అలా జరిగితే సంతోషిస్తా: మమత
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnatak Elections 2023) ఆ రాష్ట్ర ప్రజలు భాజపాకు కాకుండా ఇతర పార్టీలకు ఓటు వేయాలని పశ్చిమ బెంగాల్ (West Bengal) సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) అక్కడి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
కోల్కతా: కర్ణాకట అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Elections 2023) భాజపా పతనం ప్రారంభమైతే సంతోషిస్తానని పశ్చిమ బెంగాల్ (West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) అన్నారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ మాల్దాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న దీదీ.. భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు. భాజపా తన స్వప్రయోజనాల కోసం హిందూ మతాన్ని కించపరుస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ‘‘భాజపా ఎంత త్వరగా అధికారం కోల్పోతే.. దేశానికి అంత త్వరగా మంచి జరుగుతుంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో భాజపాకు కాకుండా ఇతర పార్టీలకు ఓటు వేయండి. కర్ణాటక ఎన్నికలతో భాజపా పతనం ప్రారంభమైతే సంతోషిస్తా. హిందూత్వంలోని పవిత్రతను భాజపా నాశనం చేస్తోంది’’ అని మమతా బెనర్జీ విమర్శించారు.
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లపై అర్ధరాత్రి దిల్లీ పోలీసులు దాడి చేయడాన్ని మమతా బెనర్జీ ఖండించారు. రెజ్లర్లపైకి ఎంత మంది కేంద్ర బలగాలను పంపారనేది కేంద్రం వెల్లడించాలని డిమాండ్ చేశారు. వారి ఆందోళనపై ఇప్పటికైనా భాజపా తన వైఖరిని చెప్పాలని డిమాండ్ చేశారు. మణిపూర్లో తిరిగి శాంతిని నెలకొల్పే బాధ్యత ప్రధాని మోదీ, అమిత్ షాదేనన్నారు. మణిపూర్ ప్రజలు సంయమనం పాటిస్తూ.. రాష్ట్రంలో శాంతిని నెలకొల్పేందుకు సహరించాలని మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్