స్వరూపానందపై ఎందుకంత ప్రేమ?: యనమల

ఏపీ సీఎం జగన్‌ రోజుకో దుష్ట సంప్రదాయంతో రాష్ట్ర ప్రజల ప్రతిష్ట, లౌకిక విలువల్ని దిగజారుస్తున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు...

Published : 15 Nov 2020 03:42 IST

అమరావతి: ఏపీ సీఎం జగన్‌ రోజుకో దుష్ట సంప్రదాయంతో రాష్ట్ర ప్రజల ప్రతిష్ట, లౌకిక విలువల్ని దిగజారుస్తున్నారని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ఆరోపించారు. ఈనెల 18న విశాఖ శారదాపీఠం స్వామీజీ స్వరూపానంద పుట్టినరోజును పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా  23 దేవాలయాల నుంచి ఆలయ మర్యాదలు, కానుకలు పంపాలన్న దేవాదాయ శాఖ ఆదేశాలను యనమల తప్పుబట్టారు.

జగన్‌ తన స్వామి భక్తి కోసం 5కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపర్చటం హేయమన్నారు. దేవాలయాలు, స్వామీజీల పట్ల రాష్ట్ర ప్రభుత్వం పాటించే సంప్రదాయాలకు ఈ ఆదేశాలు వ్యతిరేకమన్నారు. స్వరూపానందపై అంత ప్రేమ ఉంటే సొంత ఖజానా నుంచి కానుకలు ఇవ్వాలే తప్ప .. అధికార దుర్వినియోగం ఏంటని ప్రశ్నించారు. అధికార యంత్రాంగాన్ని ఒక ప్రైవేటు పీఠం ముందు మోకరిల్లజేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చినజీయర్‌స్వామి, కంచి కామకోటి పీఠాధిపతిలాంటి ఇతర స్వామీజల పుట్టినరోజులకు లేని మర్యాదలు స్వరూపానందకు చేయడం వారందరినీ కించపరచడమేనని యనమల విమర్శించారు.

ఇదీ చదవండి ..

స్వరూపానందేంద్ర జన్మదినంపై ప్రత్యేక ఆదేశాలు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని