రూ.8వేల కోట్లు ఏం చేశారు: యనమల

కరోనా వ్యాప్తి నియంత్రణలో వైకాపా ప్రభుత్వం చేతులెత్తేసిందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. ..

Published : 13 Aug 2020 02:21 IST

అమరావతి: కరోనా వ్యాప్తి నియంత్రణలో వైకాపా ప్రభుత్వం చేతులెత్తేసిందని తెదేపా సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘మీరు చెప్పిన కరోనాతో సహజీవనం ఇదేనా?. వైద్యులు, సిబ్బంది ముందస్తు నియామకాల్లో విఫలమయ్యారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటం మంచిది కాదు. కేంద్రం ఇచ్చిన రూ.8వేల కోట్లు ఏం చేశారు. కరోనా నిధుల వ్యయంపై శ్వేతపత్రం విడుదల చేయాలి’’ అని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని