Andhra News: పల్నాడులో నిరసన సెగలు... నెల్లూరులో కంటతడి పెట్టిన ఎమ్మెల్యే
కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశకు గురయ్యారు. వివిధ రూపాల్లో తమ అసమ్మతిని వ్యక్తం చేస్తుండగా..
మాచర్ల: కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో పలువురు ఎమ్మెల్యేలు తీవ్ర నిరాశకు గురయ్యారు. వివిధ రూపాల్లో తమ అసమ్మతిని వ్యక్తం చేస్తుండగా.. వారి అనుచరులు ప్రత్యక్ష ఆందోళనకు దిగుతున్నారు. పల్నాడు జిల్లా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంపై ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచినా రామకృష్ణారెడ్డి విషయంలో జగన్మోహన్రెడ్డి సర్కారు మొండిచేయి చూపడంపై మండిపడ్డారు. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి, కారంపూడి, రెంటచింతల మండలాల పరిధిలో వైకాపా నాయకులు, కార్యకర్తలు రాస్తారోకోలు నిర్వహించి నిరసన తెలిపారు. మంత్రివర్గంలోకి తీసుకోకపోతే తమ పదవులకు రాజీనామా చేస్తామని మాచర్ల మున్సిపల్ ఛైర్మన్ కిషోర్తో పాటు 30మంది కౌన్సిలర్లు, 5మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు ప్రకటించారు. ఈ నేపథ్యంలో రామకృష్ణారెడ్డి తన ఇంటికే పరిమితమయ్యారు. ఎవరినీ కలిసేందుకు ఇష్టపడటం లేదు. సీఎం కార్యాలయం నుంచి తనను సంప్రదించేందుకు జగన్ కార్యదర్శి ప్రయత్నించినా పిన్నెళ్లి అయిష్టంగా మాట్లాడి ఫోన్ స్విఛాఫ్ చేశారు.
రెంటచింతలలో రాస్తారోకో...
సీనియర్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంత్రివర్గంలో చోటు కల్పించనందుకు నిరసనగా మండల కేంద్రమైన రెంటచింతలలో ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రహదారిపై టైర్లు తగులబెట్టారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మాచర్ల నియోజకవర్గ మహిళా నాయకురాలు పాముల సంపూర్ణమ్మ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా.. వైకాపా నేతలు ఆమెను అడ్డుకున్నారు.
కంటతడి పెట్టిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి
నెల్లూరు: తనకు మంత్రి పదవి దక్కకపోవడంతో నెల్లూరు రూరల్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి భావోద్వేగంతో కంటతడి పెట్టారు. ‘‘పార్టీ కోసం మొదటి నుంచి పనిచేస్తున్నా. మంత్రి పదవి రాకపోవడం బాధ కలిగించింది. మంత్రి పదవి రాలేదని బాధ ఉన్నా పార్టీ వీడను. కార్యకర్తలు, నాయకులు వారి రక్తం చెమటగా మార్చి నాకోసం కష్టపడి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు’’ అని వివరించారు. నెల్లూరు రూరల్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీనామాలకు సిద్ధమైన వైకాపా నేతలు, కార్పొరేటర్లకు కోటంరెడ్డి నచ్చజెప్పారు. ఎవరూ రాజీనామాలు చేయవద్దని సూచించారు.
జగ్గయ్యపేటలో ఉదయభాను అనుచరుల ఆందోళన...
మంత్రివర్గంలో చోటు కల్పించకపోవడంతో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మెల్యే సామినేని ఉదయభాను అనుచరులు భగ్గుమన్నారు. ముళ్లపాడు అడ్డరోడ్డు వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై టైర్లు తగులబెట్టి నిరసన తెలిపారు. పెట్రోల్పోసి ద్విచక్రవాహనాన్ని తగులబెట్టి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలకు మంటలు అంటుకున్నాయి. వారిద్దరూ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. అనంతరం రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మరోవైపు జగ్గయ్యపేటలోని ఉదయభాను నివాసం వద్దకు వైకాపా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని నిరసన తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్ ప్రభాకర్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఉదయభానుకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉదయభానుకు మంత్రి పదవి దక్కకపోవడంతో కేడీసీసీ బ్యాంకు ఛైర్మన్ పదవికి తన్నీరు నాగేశ్వరరావు రాజీనామా చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
విజయవాడలో పార్థసారధి అనుచరుల నిరసన ..
కృష్ణా జిల్లా పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారధికి కొత్త మంత్రివర్గంలో చోటు దక్కకపోవడంతో కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పెనమలూరు నియోజకవర్గ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున విజయవాడ చేరుకుని నిరసన చేపట్టారు. రోడ్డుపై ఆందోళన చేస్తున్న అనుచరులను ఎమ్మెల్యే బుజ్జగించారు. జగన్ నాయకత్వంలో పార్టీ బలోపేతం కోసం పనిచేస్తామని పార్థసారధి తెలిపారు.
బాలినేనిని బుజ్జగించిన సజ్జల...
బాలినేని శ్రీనివాసరెడ్డికి తాజా మంత్రివర్గంలో చోటు దక్కలేదని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో సీనియర్ నేతకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకి నష్టం వస్తుందని పేర్కొన్నారు. ఒంగోలు నుంచి పలువురు వైకాపా నేతలు, కార్యకర్తలు విజయవాడలోని బాలినేని నివాసానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. మరో వైపు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి .. బాలినేని నివాసానికి వచ్చి ఆయన్ను బుజ్జగించారు. మరో వైపు బాలినేనికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఇంకొల్లు జడ్పీటీసీ పదవికి భవనం శ్రీలక్ష్మి రాజీనామా చేశారు.
తిరువూరులో...
రాష్ట్ర కేబినెట్లో తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధికి చోటు లేకపోవడంతో ఆయన అనుచరులు ఆందోళనకు దిగారు. నియోజకవర్గంలోని జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, సహకార సంఘాలు అధ్యక్షులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. తిరువూరు జడ్పీటీసీ సభ్యుడు యరమల రామచంద్రారెడ్డి, విస్సన్నపేట జడ్పీటీసీ సభ్యుడు భీమిరెడ్డి లోకేశ్వరరెడ్డి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.
సుచరిత అభిమానుల మనస్తాపం...
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరితను మంత్రివర్గంలో కొనసాగించకపోవడంపై నియోజకవర్గ పార్టీ శ్రేణులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధమయ్యారు. ఎస్సీ మంత్రులందరినీ కొనసాగిస్తూ సుచరితను తప్పించడమేంటని నిలదీశారు. కుటుంబంతో కలిసి సజ్జలను కలిసేందుకు 3రోజులుగా ప్రయత్నించినా అవకాశం ఇవ్వలేదని సుచరిత వర్గీయులు ఆవేదన వ్యక్తం చేశారు. దళిత సంఘాల నాయకులు, అభిమానులు భారీగా సుచరిత నివాసానికి చేరుకున్నారు. ఆమెకు సంఘీభావం తెలుపుతూ గుంటూరు బ్రాడీపేటలోని సుచరిత ఇంటి ముందు ఆందోళన చేపట్టారు.
* ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో నంద్యాల జిల్లా ఆత్మకూరులో ముగ్గురు కౌన్సిలర్లు రాజీనామా చేశారు. చక్రపాణిరెడ్డికి మంత్రి పదవి వస్తుందని ఆశించిన కార్యకర్తలు తీవ్ర నిరాశకు గురయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తర్ప్రదేశ్ బరిలో తెలంగాణ మహిళ.. ఆమె ఆస్తులు ఎంతంటే?
ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ లోక్సభ స్థానం నుంచి తెలంగాణ మహిళ శ్రీకళారెడ్డి పోటీచేస్తున్నారు. -
వెలంపల్లి శ్రీనివాస్, కేశినేని నానీలే సూత్రధారులు: పట్టాభిరామ్
సీఎం జగన్పై జరిగిన రాయి దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే, విజయవాడ సెంట్రల్ తెదేపా అభ్యర్థి బొండా ఉమాను ఇరికించాలని కుట్రలు చేస్తున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ధ్వజమెత్తారు. -
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
అధికారంలో ఉన్న అయిదేళ్లు వైకాపా పెద్దగా చేసిందేమీ లేకపోవడంతో ప్రచారంలో ఆ పార్టీ నేతల పనులు చూసి జనం నవ్వుకుంటున్నారు. -
వాల్తేరు క్లబ్లో వైకాపా డిష్యుం డిష్యుం!
వాల్తేరు క్లబ్ ప్రభుత్వ భూమి. ఈ రోజుకూ నేను అదే చెబుతున్నా. ఏ రోజైనా ఒక సామాజికవర్గం చేతిలో ఉండి ఉండొచ్చు. -
నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీ, తెలంగాణలో నేటి నుంచే నామినేషన్లు
నాలుగో దశ సార్వత్రిక ఎన్నికలకు (Lok sabha Elections) నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచల్ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. -
చీకటి పాలనకు చిరునామా.. జగనన్న కాలనీలు!
ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తాం.. అంటూ జగనన్న కాలనీల విషయంలో సీఎం జగన్ మొదటి నుంచీ గొప్పలు చెబుతున్నారు. -
వ్యూహకర్తలదే పెత్తనం!.. ప్రచారంలో పార్టీలను శాసించేది వారే
భారత రాజకీయాల్లో వ్యూహకర్తల పెత్తనం పెరిగిపోయింది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించే రోజులు పోయాయి. ప్రచారం మొత్తాన్ని వ్యూహకర్తలే శాసించే రోజులు వచ్చాయి. -
సార్వత్రిక సవాల్..
సార్వత్రిక ఎన్నికల సమరానికి రాష్ట్రం సిద్ధమైంది. శాసనసభ ఎన్నికల అనంతరం మరో ప్రతిష్ఠాత్మక పోరుకు తెరలేస్తోంది. -
జగనాసురుడి ఓటమి ఖాయం
‘రాముడిని తలచుకుంటే.. మంచి పాలన గుర్తొస్తుంది. మనకూ మంచి పాలకులు కావాలి, సుపరిపాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. రావణాసురుడిని చంపిన రాముడే ఆదర్శంగా.. ఈ రాష్ట్రంలోని ప్రజలంతా కలిసి తమ ఓట్లతో జగనాసురుడిని ఓడించేందుకు సిద్ధమయ్యారు. -
దుష్ట పాలనను అంతం చేద్దాం
శ్రీరామనవమి పర్వదినాన జనసేన అభ్యర్థులకు బీఫాంలను అందించడం ఆనందంగా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్కల్యాణ్ తెలిపారు. -
ఎన్నెన్నో హామీలిచ్చి.. ఆనక అయిదేళ్లూ ముంచేసి!
అయిదేళ్లలో జగన్ జిల్లాకు వచ్చినప్పుడల్లా ఇచ్చిన హామీల మొత్తం విలువ రూ.474 కోట్లు.. ఏటా గోదావరి వరదలకు కోనసీమ లంకల్లోని పల్లెలన్నీ వణికిపోయినా, గ్రామాలను అనుసంధానించే కాజ్వేలు మునిగిపోయినా నిధులు విడుదల చేయలేదు. -
తెదేపాలోకి మాజీ ఎమ్మెల్యే షేక్ సుభానీ
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ తెలుగు దేశం పార్టీలోకి చేరికలు ఊపందుకుంటున్నాయి. గుంటూరు తూర్పు తెదేపా అభ్యర్థి మహమ్మద్ నసీర్, గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో వైకాపా నాయకులు, మాజీ ఎమ్మెల్యే షేక్ సుభానీ బుధవారం ఉండవల్లిలో పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ సమక్షంలో తెదేపాలో చేరారు. -
న్యాయమూర్తులపై దూషణ కేసు నిందితుడితో ఉన్న... జగన్, విజయసాయిరెడ్డిలు నేరస్థులే!
‘న్యాయమూర్తులను దూషించిన కేసులో రెండో నిందితుడు మణి అన్నపురెడ్డితో సన్నిహితంగా ఉండటంతో పాటు అతడికి ఆశ్రయమిస్తున్న సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి నేరస్థులే’ అని తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు. -
సాక్షిలో పనిచేసిన వారు, జగన్ బంధుమిత్రులే సలహాదారులు
సాక్షి మీడియాలో పనిచేసిన వారు, సీఎం జగన్ బంధుమిత్రులు, తెదేపా ప్రభుత్వంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా పనిచేసిన ఐఏఎస్ అధికారుల్నే వైకాపా ప్రభుత్వం సలహాదారులుగా నియమించుకుందని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ఆరోపించారు. -
గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులు చేస్తున్న జగన్
గులకరాయి డ్రామాలో బీసీలను బలిపశువులను చేయడానికి సీఎం జగన్ సిద్ధమయ్యారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. -
జగన్పై దాడి కేసులో.. బొండా ఉమాను ఇరికించేందుకు వైకాపా కుట్ర
సీఎం జగన్పై రాయి దాడి కేసులో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి బొండా ఉమామహేశ్వరరావును ఇరికించేందుకు వైకాపా కుట్రలు చేస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
వాలంటీర్లపై ఆగని వైకాపా ఒత్తిళ్లు
వాలంటీర్లందరూ రాజీనామా చేసి ఆ పత్రాలను పంచాయతీ కార్యదర్శికి అందించాలి. అధికారంలోకి రాగానే వారందరినీ మళ్లీ విధుల్లోకి తీసుకుంటాం. -
వైకాపాకు అనుకూలంగా విజయవాడ సీపీ దర్యాప్తు
సీఎం జగన్పై రాయితో దాడి చేసిన ఘటనలో విజయవాడ పోలీస్ కమిషనర్(సీపీ) కాంతిరాణా వైకాపాకు అనుకూలంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ఆరోపించారు. -
‘ముస్లింలలో అభద్రతాభావం సృష్టిస్తున్న వైకాపా’
ముస్లింలలో అభద్రతాభావాన్ని పెంచి, ఎన్నికల్లో లబ్ధి పొందాలని సీఎం జగన్ కుట్రలు పన్నుతున్నారని శాసనమండలి మాజీ ఛైర్మన్ ఎంఏ షరీఫ్ మండిపడ్డారు. -
‘మోదీ వేవ్’ ఎప్పుడూ ఉంటుంది: నవనీత్ రాణా
దేశంలో ‘మోదీ వేవ్’ లేదని తాను వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతుండటంపై మహారాష్ట్రలోని అమరావతి లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి, సినీ నటి నవనీత్ రాణా బుధవారం స్పందించారు. -
‘ఆప్’ కా రామరాజ్య వెబ్సైట్ ప్రారంభం
లోక్సభ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ ‘ఆప్ కా రామరాజ్య’ వెబ్సైట్ను ప్రారంభించింది.