
Published : 16 Aug 2020 00:32 IST
‘దానిని అంటరానితనంలా పోల్చడం బాధాకరం’
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు
దిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను మీడియాతో వెల్లడిస్తున్న వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు.. ఇవాళ కూడా మీడియా ముందుకొచ్చారు. శనివారం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం జగన్ నూతన జాతీయ విద్యావిధానంపై తన ప్రసంగంలో ప్రస్తావించారు. దీనిపై రఘురామ్ స్పందిస్తూ.. తెలుగు నేర్చుకోవడాన్ని అంటరానితనంతో సీఎం పోల్చడం బాధాకరమన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని కొందరు అడ్డుకుంటున్నారని చెప్పడం దురదృష్టకరమని చెప్పారు.
Tags :