Raghurama: ఐఆర్ కంటే పీఆర్సీ తక్కువ.. చరిత్రలో చూడలేదు: రఘురామ
ఐఆర్ కంటే పీఆర్సీ తక్కువ ఉండటం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. పీఆర్సీ విషయంలో మోసపోయి..
దిల్లీ: ఐఆర్ కంటే పీఆర్సీ తక్కువ ఉండటం చరిత్రలో ఎప్పుడూ చూడలేదని వైకాపా ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. పీఆర్సీ విషయంలో మోసపోయి డిమాండ్ల సాధన కోసం ఉద్యమిస్తున్న ఉద్యోగులకు సంఘీభావంగా ఆయన దిల్లీలోని తన నివాసంలో ఇవాళ ఉపవాస దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రఘురామ మీడియాతో మాట్లాడారు.
‘‘చదువుకుని ఉద్యోగంలో చేరిన వారిని చిన్నచూపు చూడటం మంచిది కాదు. రివర్స్ పీఆర్సీపై ఇచ్చిన జీవోలను తక్షణం వెనక్కి తీసుకోవాలి. ఉద్యోగుల నిరసన దీక్షకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నా. ప్రభుత్వ ఉద్యోగులు, గురువులకు మన వంతు సాయం చేద్దాం. ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఎన్నో వాగ్దానాలు చేశారు. ఉద్యోగులకు చేసిన అన్యాయాన్ని చెప్పడానికే ఉపవాస దీక్ష చేస్తున్నాను. జీతాలు పెంచకపోతే అవినీతిని పెంచినట్లే అని సీఎం చాలా సార్లు చెప్పారు. ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం బాధపెడుతోంది. కేవలం జీతం పైనే బతికే వాళ్లకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి’’ అని రఘురామ అన్నారు. ఎంపీ దీక్ష ఈ సాయంత్రం ఆరు గంటల వరకు కొనసాగనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత