ఎంపీ రఘురామ, టీవీ5 ఛైర్మన్పై ప్రధానికి వైకాపా ఫిర్యాదు
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు, టీవీ 5 ఛైర్మన్ బీఆర్ నాయుడుపై వైకాపా ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీకి ఫిర్యాదు.....
దిల్లీ: నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు, టీవీ 5 ఛైర్మన్ బీఆర్ నాయుడుపై వైకాపా ఎంపీలు ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశారు. వారిద్దరి మధ్య హవాలా లావాదేవీలు జరిగినట్టు విజయసాయిరెడ్డి నేతృత్వంలో 15మంది ఎంపీల బృందం ఫిర్యాదులో పేర్కొంది. మిలియన్ యూరోలు బదిలీ జరిగినట్టు వైకాపా ఎంపీలు ఆరోపించారు. మనీలాండరింగ్, ఫెమా చట్టాల కింద విచారణ జరపాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
అలాగే, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ను కూడా వైకాపా ఎంపీలు కలిశారు. పోలవరం, ప్రత్యేక హోదాపై వెంటనే జోక్యం చేసుకోవాలని ఆమెను కోరారు. పోలవరం తుది డీపీఆర్కు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. 2017-18 ధరల ప్రకారం భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి కలిపి రూ.55,656.87 కోట్లకు సీడబ్ల్యూసీ, టీఏసీలు ఆమోదం తెలిపాయని వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం