Andhra News: వైకాపా రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైకాపా అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థుల పేర్లను
అమరావతి: ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో వైకాపా అభ్యర్థులను ఖరారు చేసింది. అభ్యర్థుల పేర్లను ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డికి మరోసారి అవకాశం కల్పించారు. ఆయనతో పాటు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, న్యాయవాది నిరంజన్ రెడ్డి, బీద మస్తాన్రావును అభ్యర్థులుగా ఖరారు చేశారు. అభ్యర్థుల ఎంపికపై వైకాపా అధినేత, సీఎం జగన్ పలుమార్లు ముఖ్యనేతలతో చర్చించారు. అనంతరం అభ్యర్థులను ఖరారు చేశారు.
సామాజిక న్యాయం పాటిస్తూ అభ్యర్థుల ఎంపిక: బొత్స
ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ రాజ్యసభ అభ్యర్థుల ఎంపికలో అన్ని అంశాలను పరిశీలించి సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. బలహీనవర్గాలకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారని.. సామాజిక న్యాయం పాటిస్తూ అభ్యర్థులను ఎంపిక చేశారని చెప్పారు. పరిపాలన, నామినేటెడ్ స్థానాల్లో బలహీనవర్గాలకు అవకాశం కల్పించి వారిని పైకి తీసుకురావాలన్నదే జగన్ ఆలోచన అని బొత్స అన్నారు.
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ బీసీలంటే బ్యాక్ వర్డ్ కాదు.. బ్యాక్ బోన్ అనేది సీఎం అభిప్రాయమని చెప్పారు. భవిష్యత్తులో మహిళలకు జగన్ ప్రాధాన్యమిస్తారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు అన్నింటా సమాన అవకాశాలు ఉండాలనేది సీఎం విధానమని.. మూడేళ్లలో అన్నింటా సామాజిక న్యాయాన్ని అమలు చేసి జగన్ నిబద్ధత పాటించారని చెప్పారు. తెదేపాలా అన్నింటినీ తాము రాజకీయం చేయడం లేదని సజ్జల వ్యాఖ్యానించారు.
‘‘సీఎం జగన్ బీసీలకు 44 శాతం రిజర్వేషన్ కల్పించారు. బీసీల పోరాటం అనేది తెలంగాణకు పరిమితమైన అంశం కాదు. దేశవ్యాప్తంగా బీసీల కోసం నేను పోరాడుతున్నాను. బీసీల హక్కుల కోసం జాతీయ స్థాయిలో పోరాటం చేస్తున్నాను. నా పోరాటాన్ని గుర్తించి ఏపీ సీఎం జగన్ నాకు ఈ అవకాశం కల్పించారు. - ఆర్ కృష్ణయ్య
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
కొంతమంది ముంబయి ఆటగాళ్లు రోహిత్ శర్మనే కెప్టెన్ అనుకుంటున్నారు: ఇర్ఫాన్ పఠాన్
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM