Yogi Adityanath: శ్రీకృష్ణుడు మిమ్మల్ని శపిస్తున్నాడు.. అఖిలేశ్కు యోగి కౌంటర్
ఉత్తరప్రదేశ్ రాజకీయం ఇప్పుడు కృష్ణ భగవానుడి చుట్టూ తిరుగుతోంది. కృష్ణుడు తన కలలోకి వస్తున్నాడని, రామరాజ్యాన్ని నెలకొల్పడానికి త్వరలో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు
లఖ్నవూ: ఉత్తరప్రదేశ్ రాజకీయం ఇప్పుడు కృష్ణ భగవానుడి చుట్టూ తిరుగుతోంది. కృష్ణుడు తన కలలోకి వస్తున్నాడని, రామరాజ్యాన్ని నెలకొల్పడానికి త్వరలో తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెబుతున్నాడని సమాజ్వాదీ పార్టీ అధినేత, అఖిలేశ్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ వ్యాఖ్యలకు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. కృష్ణ భగవానుడు వారిని శపిస్తాడంటూ మాజీ సీఎంకు పరోక్షంగా గట్టి కౌంటర్ ఇచ్చారు.
అసలేం జరిగిందంటే..
ఇటీవల భాజపా రాజ్యసభ సభ్యుడు హర్నాథ్ సింగ్ యాదవ్ పార్టీ అధిష్ఠానికి ఓ లేఖ రాశారు. ‘‘యోగి ఆదిత్యనాథ్ ఈ సారి మథుర నుంచి పోటీ చేయాలని రాత్రి నా కలలో ఎవరో చెప్పారు. బహుశా ఆ కృష్ణ పరమాత్ముడే ఈ విషయంలో నన్ను మధ్యవర్తిత్వం చేయమని ఆదేశించి ఉంటాడు’’ అని హర్నాథ్ లేఖలో రాసుకొచ్చారు. ఇది కాస్తా వైరల్గా మారింది.
దీనిపై నిన్న ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ స్పందిస్తూ.. భాజపానుద్దేశించి వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ‘‘గత రాత్రి నాకు కలలో కృష్ణ భగవానుడు కన్పించి.. రామరాజ్యం నెలకొల్పడానికి త్వరలోనే నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పాడు. నిన్న ఒక్క రోజే కాదు.. కృష్ణుడు ప్రతి రోజూ నా కల్లోకి వస్తాడు’’ అని అఖిలేశ్ వ్యాఖ్యానించారు.
దీనికి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా గట్టిగానే బదులిచ్చారు. ‘‘కొంతమందికి కృష్ణ పరమాత్ముడు తప్పకుండా కలలో కన్పిస్తాడు. వారి వైఫల్యాలకు ఇప్పుడైనా దుఃఖించమని చెప్పి ఉంటాడు. మీరు(అఖిలేశ్ను ఉద్దేశిస్తూ) చేయలేనిది భాజపా ప్రభుత్వం చేసి చూపిస్తోంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు మథుర, బృందావనం అభివృద్ధికి ఏం చేశారని ప్రశ్నిస్తూ భగవాన్ శ్రీకృష్ణుడు మిమ్మల్ని శపిస్తున్నాడు’’ అని యోగి వ్యాఖ్యలు చేశారు.
మరికొద్ది నెలల్లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సారి యోగి ఆదిత్యనాథ్ అయోధ్య లేదా మథుర నుంచి పోటీ చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై ఇటీవల యోగి స్పందిస్తూ.. పార్టీ ఆదేశిస్తే తాను ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు సిద్ధమే అని ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత
నామినేషన్ వేసేందుకు తెదేపా (TDP), వైకాపా (YSRCP) అభ్యర్థులు ఒకే సమయంలో చేరుకోవడంతో తిరుపతిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. -
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
‘సీఎం జగన్పై గులకరాయితో దాడి జరిగిన నిమిషాల్లోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని క్రూరంగా నరికి..నరికి చంపి 5 ఏళ్లు గడిచినా ఇప్పటికీ న్యాయం జరగలేదు’ అని వివేకా కుమార్తె సునీత ఆవేదన వ్యక్తం చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం
-
మోదీజీ.. ఆ చప్పట్లకు మోసపోకండి: ప్రధానికి ఖర్గే లేఖ
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు