TS News: కొవిడ్‌ నిబంధనలు కేవలం ప్రతిపక్షాలకేనా?: వైఎస్‌ షర్మిల

కొవిడ్‌ నిబంధనలు కేవలం ప్రతిపక్షాలకేనా... అధికార పార్టీకి వర్తించవా? అని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. రైతు ఆవేదన యాత్రకు పోలీసులు

Published : 08 Jan 2022 01:29 IST

హైదరాబాద్‌: కొవిడ్‌ నిబంధనలు కేవలం ప్రతిపక్షాలకేనా... అధికార పార్టీకి వర్తించవా? అని వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. రైతు ఆవేదన యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వరంగల్‌తో పాటు పలు ప్రాంతాలకు చెందిన ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను లోటస్‌పాండ్‌కు పిలిపించారు. వారందరినీ పరామర్శించిన షర్మిల.. ఎలా చనిపోయారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన షర్మిల... రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా స్పందించారు. తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడేళ్లలో 8వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ రైతుల ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పండిన పంటను అమ్ముకోలేక కొందరు, ధరణి సమస్యలతో మరి కొందరు, అప్పులతో ఇంకొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇక్కడ ఇంతమంది చనిపోతే పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్‌.. ఎక్కడో హర్యానాలో చనిపోయిన రైతులకు పరిహారం ఇస్తారంట అని ఎద్దేవా చేశారు. ర్యాలీ, సభలు, సమావేశాలు నిషేధిస్తూ గత నెల 25న జీవో ఇచ్చినా.. అధికార పార్టీ  నల్గొండ జిల్లాలో ర్యాలీ, సభలు ఎలా పెడతారని షర్మిల నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని