TS News: కొవిడ్ నిబంధనలు కేవలం ప్రతిపక్షాలకేనా?: వైఎస్ షర్మిల
కొవిడ్ నిబంధనలు కేవలం ప్రతిపక్షాలకేనా... అధికార పార్టీకి వర్తించవా? అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. రైతు ఆవేదన యాత్రకు పోలీసులు
హైదరాబాద్: కొవిడ్ నిబంధనలు కేవలం ప్రతిపక్షాలకేనా... అధికార పార్టీకి వర్తించవా? అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. రైతు ఆవేదన యాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వరంగల్తో పాటు పలు ప్రాంతాలకు చెందిన ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలను లోటస్పాండ్కు పిలిపించారు. వారందరినీ పరామర్శించిన షర్మిల.. ఎలా చనిపోయారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయా కుటుంబాలకు ఆర్థిక సాయం చేసిన షర్మిల... రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రంగా స్పందించారు. తెరాస ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడేళ్లలో 8వేల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. తెలంగాణ రైతుల ఆత్మహత్యల రాష్ట్రంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పండిన పంటను అమ్ముకోలేక కొందరు, ధరణి సమస్యలతో మరి కొందరు, అప్పులతో ఇంకొందరు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇక్కడ ఇంతమంది చనిపోతే పట్టించుకోని ముఖ్యమంత్రి కేసీఆర్.. ఎక్కడో హర్యానాలో చనిపోయిన రైతులకు పరిహారం ఇస్తారంట అని ఎద్దేవా చేశారు. ర్యాలీ, సభలు, సమావేశాలు నిషేధిస్తూ గత నెల 25న జీవో ఇచ్చినా.. అధికార పార్టీ నల్గొండ జిల్లాలో ర్యాలీ, సభలు ఎలా పెడతారని షర్మిల నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సంక్షిప్త వార్తలు (8)
ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థులను గెలిపించాలని ఆంధ్రా పెన్షనర్స్ పార్టీ నాయకులు కోరారు. ఏలూరులో సోమవారం నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పి.సుబ్బరాయన్ మాట్లాడుతూ -
రూ.వందల కోట్ల దేవుడి సొమ్మును దోచిపెడుతున్న ధర్మారెడ్డి
¸కేంద్రం నుంచి రాష్ట్రానికి డిప్యుటేషన్పై వచ్చిన ధర్మారెడ్డి, వెంకటరెడ్డి, రమణారెడ్డి, మధుసూదన్రెడ్డి లాంటి అధికారులు వైకాపా తొత్తుల్లా మారి.. రూ.లక్షల కోట్ల జగన్ అవినీతిలో భాగస్వాములుగా మారారని తెదేపా అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్కుమార్ ధ్వజమెత్తారు. -
బుగ్గనా... ఇదేనా మీ అభివృద్ధి?
‘ఎక్కడికక్కడ అభివృద్ధి చేశానని ఊదరగొట్టే ప్రసంగాలు చేసే బుగ్గనా... ఇదేనా మీరు చేసిన అభివృద్ధి?’ అని నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా